ఏ ముహూర్తంలో రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ ప్రారంబించారో కానీ అన్ని అవరోధాలు ఏర్పడుతున్నాయి. బాహుబలి సూపర్ హిట్ తర్వాత సంవత్సరం గ్యాప్ తీసుకొని ఎన్టీఆర్, రాంచరణ్ మల్టీ స్టారర్ మూవీగా ‘ఆర్ఆర్ఆర్’తీస్తున్నారు. ఈ సినిమా రూ.400 వందల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టిన రాజమౌళి 1920 నాటి పరిస్థితుల్లో స్వతంత్ర ఉద్యమ నేపథ్యంలో సినిమా ఉండబోతుందని ప్రకటించారు. ఈ మూవీలో రాంచరణ్.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్..కొమురం భీమ్ గా కనిపించబోతున్నట్లు ప్రకటించారు.
మరో ముఖ్యపాత్రలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగాన్ కూడా నటిస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో బాలీవుడ్ నుంచి ఆలియా భట్, హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గర్ జోన్స్ ని తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కానీ డైసీ ఎడ్గర్ జోన్స్ ఈ ప్రాజెక్ట్ లో నటించడం లేదని తర్వాత ట్వీట్ చేశారు. ఇటీవల పూనేలో రాంచరణ్ కి కాలుకి ప్రమాదం జరగడంతో నెల రోజుల పాటు పోస్ట్ పోన్ చేశారు. తాజాగా ఇప్పుడు ఎన్టీఆర్ కూడా గాయపడ్డాడు. ఆయన కుడి చేతికి గాయం అయినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు చెబుతున్నాయి.
అయితే, ఈ గాయం మరీ పెద్దదేమీ కాలేదని తెలుస్తోంది. చేతికి కట్టుతోనే ఎన్టీఆర్ షూటింగ్ కు వస్తున్నట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది. అలాంటపుడు షూటింగ్ లో ఏ యాక్షన్ సీన్లు పనిచేయడానికి వీల్లేదు...ఒకవేళ ప్రమాదం మరీ తీవ్రమైతే ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ మరికొంత కాలం పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ నటిస్తుండగా ఎన్టీఆర్ కు జోడిగా ఇంకా ఎవరినీ తీసుకోలేదు.