టాలీవుడ్ లో బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక సినిమా తర్వాత రాజమౌళి మల్టీ స్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’రూపొందిస్తున్నారు.  ఈ సినిమాలో టాలీవుడ్ టాప్ హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ లు నటిస్తున్నారు.   ఈ సినిమా గురించి ఆ మద్య రాజమౌళి ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు.  ఈ సందర్బంగా సినిమా 1920 నాటి పరిస్థితులకు అద్దం పట్టే విధంగా అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ ల పై సాగే కథగా తెలిపారు. అయితే అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్ నటిస్తుండగా..కొమురం భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. 

రాంచరణ్ సరసన బాలీవుడ్ నటి అలియాభట్ నటిస్తుంది.  అయితే ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఎడ్గర్ జోన్స్  నటిస్తున్నట్లు తెలిపారు.  కానీ ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తర్వాత పేర్కొన్నారు. దాంతో ఇప్పుడు ఎన్టీఆర్ సరసన హీరోయిన్ కోసం వేట మొదలైంది.  ఇక ఎన్టీఆర్ సరసన నాయికగా పరిణితీ చోప్రా పేరు వినిపిస్తోంది. ఆమె ఎంపిక విషయంలో స్పష్టత రావలసి వుంది. కానీ ఇంతలోనే మరికొంత మంది హీరోయిన్ల పేర్లు తెరపైకి వస్తున్నాయి.

ఈ మద్య బాలీవుడ్ నటి..సాహూ హీరోయిన్ శ్రద్దా కపూర్ ని తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చినా..ఆమె డేట్స్ కుదరడం లేదని క్లారిటీ ఇచ్చినట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.  ఈ నేపథ్యంలోనే జాక్విలిన్ ఫెర్నాండజ్ పేరు తెరపైకి వచ్చింది. ఆమెను సల్మాన్ ఖాన్ సిఫార్స్ చేసినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. అయితే హీరోయిన్ పాత్రకా? లేదంటే మరేదైనా పాత్రకా? అనే విషయం తెలియాల్సి వుంది.  ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రలో అజయ్ దేవగణ్,  సముద్రఖని నటిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: