ఇటీవల హైదరాబాద్ పరిసర ప్రాంతంలో అక్రమంగా కట్టిన భవనాలపై తెలంగాణ ప్రభుత్వం కూల్చివేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టిన విషయం మనకందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సంబంధించిన ఒక ఫామ్ హౌస్ రాయదుర్గం దగ్గర కట్టారని రెవెన్యూ అధికారులు గుర్తించి వెంటనే ప్రభాస్ కి నోటీసులు జారీ చేసి ఖాళీ చేయాలని ఆదేశించడం జరిగింది.
ఈ వార్త అప్పట్లో మీడియా లో పెద్ద సంచలనమైంది. వెంటనే స్పందించిన ప్రభాస్ ఆ భవనాన్ని న్యాయబద్ధంగా కొన్నట్లు ఆధారాలతో సహా కొనుగోలు చేసిన పత్రాలను న్యాయస్థానంలో తన తరఫున న్యాయవాదులు చేత ప్రభాస్ చూపించడం జరిగింది. దీంతో ప్రభాస్ మరియు తెలంగాణ ప్రభుత్వం వాదనలు విన్న హైకోర్టు తాజాగా ఇటీవల ఆసక్తికరమైన తీర్పును వెలువరించింది.
క్రమబద్దీకరణకు అవకాశం ఇవ్వకుండా ప్రభాస్ని గెస్హౌజ్ నుంచి ఖాళీ చేయించడం చట్టవిరుద్ధమని తేల్చి చెప్పడంతో ప్రభాస్ షాక్కు గురయ్యారు. ప్రభాస్ క్రమబద్దీకరణ కోసం వేసిన కేసుపై విచారణ చేసిన హైకోర్టు ధర్మాసనం ఆ స్థలం వివాదంలో ఉందని తేల్చి చెప్పింది. అంతేకాకుండా ల్యాండ్ విషయంలో అతిగా ప్రవర్తించిన అధికారులపై కోర్టు అక్షింతలు వేసింది.