ఈ మాటలు అంటుంది ఎవరో తెలుసా మహిళా నేతగా ఎంతో మంది గుండెల్లో చెరగని ముద్ర వేసుకొని అందరితో దీదీ అని పిలుపించుకుంటున్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.  తాజాగా బాఘిని చిత్రం తన బయోపిక్ అంటూ వస్తోన్న వార్తలపై పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ స్పందించారు. ఇప్పటికే పలువురి రాజకీయ, క్రీడా, సినీ నేపథ్యాల్లో బయోపిక్ లు వస్తున్నాయి.  


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవిత కథతో పిఎం నరేంద్రమోడీ చిత్రం వస్తున్న విషయం తెలిసిందే.  ఇటీవల మన్ మోహన్ సింగ్ బయోపిక్, థాక్రే బయోపిక్ లు వచ్చాయి.  ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ జీవిత కథ ఆధారంగా చేసుకొని ఓ బయోపిక్ వస్తుందని రూమర్లు పుట్టుకొచ్చాయి.  తాజాగా మమతాబెనర్జీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...నా బయోపిక్ అంటూ వస్తోన్న వార్తలన్నీ వట్టి పుకార్లు మాత్రమే. నాకు ఏ బయోపిక్ తో సంబంధం లేదు. కొందరు కొన్ని కథలు సిద్దం చేసుకుని, వారికి నచ్చిన విధంగా చిత్రాలు తీస్తే అది నా బయోపిక్ ఎలా అవుతుంది.


అంతే కాదు నా బయోపిక్ తీసేందుకు నేను నరేంద్ర మోదీ ని కాదు. ఇలాంటి అసత్య వార్తలను సృష్టిస్తూ పరువునష్టం దావా వేసేలా నన్ను ప్రేరేపించకండి అని ట్వీట్ చేశారు మమతాబెనర్జీ. బాఘిని సినిమా బయోపిక్ కాదని, మమతాబెనర్జీని ఆదర్శంగా తీసుకుని రాసుకున్న కథ అని ఇప్పటికే దర్శకుడు వెల్లడించిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: