మహేష్ అనీల్ రావిపూడి మూవీ ప్రాజెక్ట్ లో విజయశాంతిని కీలక పాత్రకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. తెలుగు సినిమా లేడీ అమితాబ్ బచ్చన్ అనే స్థాయికి ఎదిగిన ఈమె గతంలో హీరోలతో సమానంగా పారితోషికం డిమాండ్ చేసింది అన్న వార్తలు కూడా ఉన్నాయి. అయితే ఆ తరువాత ఆమె రాజకీయాల బాట పట్టి అనేక సంవత్సరాల పాటు ఒక వెలుగు వెలిగింది. 

ప్రస్తుతం ఈ సీనియర్ హీరోయిన్  మళ్లీ చాన్నాళ్ల తరువాత మొహానికి మేకప్  వేసుకుంటూ మహేష్ తో ఒక కీలక పాత్రలో నటిస్తోంది.  తెలుస్తున్న సమా చారం మేరకు ఈమెది సినిమాలో ఈమెదిఫుల్ లెంగ్త్ లో ఉండే కీ రోల్ అని తెలుస్తోస్తోంది. దీనితో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ లేడీ సూపర్ స్టార్ పారితోషికం ఎంత తీసుకుంటోంది అన్న కోణంలో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. 

తెలుస్తున్న  సమాచారం మేరకు ఈమె ఈమూవీలో నటించేందుకు రోజుకు నాలుగు లక్షలు డిమాండ్ చేసినట్లు టాక్. అయితే ఈసినిమాలో ఈమె పాత్ర కీలకం కావడంతో ఈమె డేట్స్ 45రోజుల వరకు కావలసి రావడంతో ఆమెను కోటి రూపాయల పారితోషికానికి ఒప్పించడాని ఈ మూవీ దర్శక నిర్మాతలు చాలా పాట్లు పడినట్లు వార్తలు వస్తున్నాయి. 

దీనితో విజయశాంతి కోరికలు రమ్యకృష్ణ స్థాయిలో ఉన్నాయి అన్న కామెంట్స్ వస్తున్నాయి. అంచనాలకు అనుగుణంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే విజయ శాంతి  రమ్యకృష్ణకు పోటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో కామెంట్స్ వస్తున్నాయి.  సుమారు 30 సంవత్సరాల క్రితం చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన మహేష్ కు అమ్మగా నటించిన విజయశాంతి మళ్ళీ ఇప్పడు సూపర్ స్టార్ మహేష్ కు తల్లి గా నటించడం యాదృశ్చికం అని అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: