మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా వస్తున్న చివరి మూవీ అవెంజర్స్ ఎండ్ గేమ్ ఈ నెల 26వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న విషయం విదితమే. ఇంగ్లిష్తోపాటు హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదలవుతున్నది. కాగా ఈ సినిమాకు గాను ఈ నెల 20వ తేదీ నుంచే టిక్కెట్లను విక్రయించడం ప్రారంభించారు. ఇన్ఫినిటీ స్టోన్స్ ను సొంతం చేసుకుని విశ్వాన్ని తన అధీనంలో ఉంచుకోవాలని థానోస్ చేసే ప్రయత్నాలను ప్రపంచ సూపర్ హీరోస్ తమ చివరి పోరులో ఎలా ఎదుర్కొంటారు? అన్న కథతో రూపొందిన మూవీ 'అవెంజర్స్ : ఎండ్ గేమ్'. ప్రపంచ సినీ అభిమానులు ఇప్పుడు అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్న మూవీ ఇదే.
ఈ క్రమంలోనే టిక్కెట్లను అమ్మకానికి పెట్టిన మొదటి రోజే బుక్మైషో వెబ్సైట్లో ఏకంగా 10 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఈ మేరకు బుక్మైషో ప్రతినిధులు తాజాగా వివరాలను వెల్లడించారు. ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, హల్క్, థార్, బ్లాక్ విడో, వార్ మెషీన్, కెప్టెన్ మార్వెల్ తదితరులు థానోస్ ను ఎలా ఎదుర్కొంటారో చూసేందుకు చిన్నారులతో పాటు పెద్దలు సైతం ఆసక్తిని చూపుతుండటంతో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ స్వింగ్ లో నడుస్తున్నాయి.
ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లోని అన్ని మల్టీప్లెక్స్లు, సాధారణ థియేటర్లలో అవెంజర్స్ ఎండ్ గేమ్ టిక్కెట్లు వచ్చే ఆదివారం వరకు బుక్ అయ్యాయని బుక్ మై షో ప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటికే విడుదలైన అన్ని థియేటర్లలో వారాంతం వరకూ టికెట్ల బుకింగ్ అయిపోయినట్టు తెలు స్తోంది. ఇక నిన్న 'అవెంజర్స్ : ఎండ్ గేమ్' అడ్వాన్స్ టికెట్ల బుకింగ్ ప్రారంభం కాగా, హైదరాబాద్ లోని ఐమాక్స్ థియేటర్ వద్ద టికెట్ల కోసం క్యూ సుమారు కిలోమీటర్ దూరం సాగడం గమనార్హం.ఒక వెబ్సైట్లో అత్యధికంగా టిక్కెట్లు అమ్ముడుపోయిన సినిమాగా అవెంజర్స్ ఎండ్ గేమ్ కొత్త రికార్డు సృష్టించిందని వారు చెప్పారు.