నందమూరి వారసుడు బాలక్రిష్ణ ఇపుడు గేరప్ అవుతున్నారు. ఆయన అటు సినిమాలు, ఇటు రాజకీయాలు రెండు పడవల మీద కాలు వేసి ముందుకు సాగుతున్న సంగతి విధితమే. అయితే ఈ మధ్య ఎన్నికల సీజన్ కావడంతో బాలయ్య సినిమాలకు కాస్తా లీవ్ ఇచ్చేసి మరీ ఎండల్లో రోజుల తరబడి పొలిటిచల్ స్పీచులు దంచాడు. ఇపుడు ఎన్నికలు ముగిసాయి. మరి  రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి.


ఈ విషయంలో ఎవరికి ఎలాంటి టెన్షన్లు ఉన్నా బాలయ్యకు మాత్రం బేఫికరే. ఎందుకంటే టీడీపీ పవర్లోకి వచ్చినా ఓడినా కూడా బాలయ్య ఎమ్మెల్యేగా మాత్రమే ఉంటాడు. అందులో డౌట్లు ఆయనకూ లేవు. దాంతో మెల్లగా ఒక్కో సినిమానూ పట్టాలెక్కించే పనిలో ఇపుడు బిజీగా ఉన్నాడట. ఇపుడు బాలయ్య ఒకేసారి రెండు మూవీస్ చేసేందుకు రెడీ అయిపోయాడు. రెండు నెలల తేడాలో ఈ మూవీస్ సెట్స్ మీదకు వెళ్ళబోతున్నాయి.


గత ఏడాది తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ తో బాలయ్య జై సిమ్హా మూవీ చేశాడు. సంక్రాంతికి రిలీజ్ అయి ఈ మూవీ కమర్షియల్ గా బాగా  వర్కౌట్ అయింది. దాంతో సేమ్  కాంబోని రిపీట్ చేసేందుకు ఆ మూవీ నిర్మాత సీ కళ్యాణ్ రంగం సిద్ధం చేశాడు. మేలో ఈ మూవీ స్టార్ట్ అవుతోంది. ఇక బాలయ్య బోయపాటి మూవీ ఆగస్ట్ లో సెట్స్ మీదకు వస్తోంది. ఈ రెండు మూవీస్ సమాంతరంగా బాలయ్య చేస్తాడని టాక్. వీటితో పాటు మరికొన్ని కమిట్మెంట్స్ కూడా బాలయ్యకు ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి


మరింత సమాచారం తెలుసుకోండి: