సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో ముగ్గురు బడా నిర్మాతలు కలిసి నిర్మిస్తున్న సినిమా మహర్షి. మే 9న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమాలో మహేష్ 3 డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తున్నాడని తెలుస్తుంది. ఇదవరకు స్టూడెంట్ గా.. ఆ తర్వాత టీజర్ లో కంపెనీ సిఈఓ గా కనిపించిన మహేష్. లేటెస్ట్ గా పదర పదర పదరా సాంగ్ లో రైతుగా కనిపించాడు.


దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్.. శ్రీమణి సంగీతం.. శంకర్ మహదేవన్ వాయిస్ ఆ పాటకి మరికొంత అందాన్ని తెచ్చాయి. అయితే ఆ పాటలో మహేష్ రైతుగా కనిపిస్తున్నాడని చూపించారు. శ్రీమంతుడు సినిమాలో కూడా జాగో సాంగ్ లో మహేష్ ఊరు బాగు కోసం కష్టపడే వాడిగా కనిపించాడు. అయితే మహర్షిలో రైతుగా కనిపిస్తున్నాడు.


సాంగ్ లో ఎమోషన్.. లిరిక్స్ స్పూర్తిదాయకంగా ఉన్నా రైతుగా మహేష్ చొక్కా మాత్రం నలగలేదు అన్నది కొందరి కామెంట్. మహేష్ జస్ట్ అలా నిలబడితేనే చూసే బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు కాని రైతుగా చూపిస్తూ మళ్లీ అదే రిచ్ లుక్ చూపిస్తే ఎలా అన్నది వారి పాయింట్.. అయితే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే కంపెనీ సిఈఓ రైతుగా మారితే ఆయన మెయింటెనెన్స్ అంతలోనే మారదు కదా అని మహేష్ ఫ్యాన్స్ సర్ధిచెబుతున్నారు.


ఏది ఏమైనా దిల్ రాజు, వంశీ పైడిపల్లి చెప్పినట్టుగా మహేష్ మహర్షి సినిమాతో గట్టి కాన్సెప్ట్ తోనే వస్తున్నాడని తెలుస్తుంది. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. మే 9న రిలీజ్ ఫిక్స్ చేసిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మే 1న జరుగనుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: