విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ డియర్ కామ్రేడ్ సెట్స్ మీద ఉంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాను భరత్ కమ్మ డైరెక్ట్ చేస్తున్నరు. విజయ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుండి ఈమధ్య వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.


ఇదిలాఉంటే డియర్ కామ్రేడ్ విషయంలో హీరో విజయ్ కు డైరక్టర్ భరత్ కమ్మకు అసలు పడట్లేదన్నది లేటెస్ట్ టాక్. కాకినాడ, తుని ఏరియాల్లో 60 రోజుల పాటు ఓ షెడ్యూల్ చేయగా ఆ సీన్స్ అవుట్ పుట్ చూశాక విజయ్ దేవరకొండ పెద్ద సాటిస్ఫై కాలేదట. అందుకే నిర్మాతలను ఒప్పించి మళ్లీ రీ షూట్ అడిగాడట. డైరక్టర్ భరత్ కమ్మ అందుకు ఒప్పుకోలేదట. ఈ విషయంలో డైరక్టర్, హీరో మధ్య గొడవ జరిగిందని టాక్.


ఎలాగోలా డైరక్టర్, హీరో ఇద్దరికి సర్ధి చెప్పి 45 రోజులు రీ షూట్ జరిపారట. అయితే అవి కూడా అవుట్ పుట్ బాగాలేదన్నది టాక్. అందుకే టీజర్ లో జస్ట్ కంటెంట్ హింట్ ఇవ్వకుండా ప్లాన్ చేశారు. మే 1న కామ్రేడ్స్ కు గిఫ్ట్ గా ఏదైనా సర్ ప్రైజ్ ప్లాన్ చేశారట. మొత్తానికి విజయ్ ప్రతి సినిమా రిలీజ్ కు ముందు ఉండే రచ్చ ఈ సినిమాకు కొనసాగుతుంది.


ఒకవేళ విజయ్ కు ఈ సినిమా రిజల్ట్ తేడా కొడితే కచ్చితంగా తన తర్వాత సినిమాల మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పటికే మే 1 అనుకున్న రిలీజ్ డేట్ కూడా వాయిదా పడగా కొత్త రిలీజ్ డే ఇంకా ఫిక్స్ చేయలేదు. డియర్ కామ్రేడ్ ఒక్క తెలుగులోనే కాదు సౌత్ అన్ని భాషల్లో ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: