బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ మూవీపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. డివివి దానయ్య 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో అలియా భట్ ఒక హీరోయిన్ గా నటిస్తుండగా తారక్ కు జోడీగా ఎంపిక చేసిన డైసీ ఎడ్గర్ జోన్స్ ప్రాజెక్ట్ నుండి బయటకు వెళ్లగా ఆమె స్థానంలో మరో హీరోయిన్ కోసం వేట మొదలుపెట్టారు.


అయితే రాజమౌళి ఏ సినిమాకు లేని ఓ కన్ ఫ్యూజన్ ఆర్.ఆర్.ఆర్ కు ఏర్పడుతుంది. ఎప్పుడూ తన కాస్టింగ్ విషయంలో పర్ఫెక్ట్ గా ఉండే రాజమౌళి ఒకరిని అనుకుని వారు కాదన్నాక మరొకరిని వెతకలేదు. అంతేకాదు పూణె షెడ్యూల్ ఈ పాటికల్లా ముగించాల్సి ఉంది. కాని చరణ్ కు కాలికి గాయమవడం వల్ల షూటింగ్ వాయిదా పడ్డది.


ఇక ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ థర్డ్ షెడ్యూల్ మొదలు పెట్టాల్సి ఉంది. అయితే ఈ షెడ్యూల్ లో హీరోయిన్స్ ఇద్దరు పాల్గొనాల్సిన అవసరం ఉందట. అలియా భట్ ఒక హీరోయిన్ ఓకే అవగా సెకండ్ హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదు. ఈమధ్యలో శ్రద్ధా కపూర్, పరిణితి చోప్రా, నిత్యా మీనన్ వంటి హీరోయిన్స్ పేర్లు వినిపించినా వాళ్లెవరు ఫైనల్ కాలేదని తెలుస్తుంది.


ఇదిలాఉంటే బాలీవుడ్ యాక్షన్ హీరో సల్మాన్ ఖాన్ ఆర్.ఆర్.ఆర్ సెకండ్ హీరోయిన్ గా జాక్వెలిన్ ను తీసుకోమని సలహా ఇచ్చాడట. శ్రీలంక బ్యూటీ అయిన జాక్వెలిన్ ఫెర్నాండేజ్ అచ్చం అమెరికన్ బ్యూటీలానే ఉంటుంది. మరి సల్మాన్ సలహాని రాజమౌళి ఓకే అంటాడో తిరస్కరిస్తాడో కాని ట్రిపుల్ ఆర్ విషయంలో ఎప్పుడు లేనిది రాజమౌళి ప్లాన్స్ అన్ని బెడిసి కొడుతున్నట్టుగా ఉన్నాయి. మరి వీటి పర్యావసానాలు సినిమా మీద ఏమాత్రం ప్రభావితం అవుతాయో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: