ఈనెల విడుదలైన ‘మజిలీ’ ‘జెర్సీ’ సినిమాలు రెండు వరస విజయాలు సాధించడంతో ప్రేక్షకులు మాస్ మసాలా సినిమాల కంటే ఎమోషనల్ సినిమాల వైపు బాగా కనెక్ట్ అవుతున్నారా అన్న సందేహాలు వస్తున్నాయి. దీనితో మన టాప్ హీరోల ఆలోచనలు మాస్ సినిమాల వైపు నుంచి ఎమోషనల్ సినిమాల వైపు మల్లుతున్నాయి అని చెప్పదగిన విషయం లేటెస్ట్ గా జరిగినట్లు తెలుస్తోంది. 

ఎన్నికల హడావిడి పూర్తి కావడంతో బాలకృష్ణ ఈ ఎన్నికల ఫలితాలు వచ్చే లోపే బోయపాటి బాలయ్యల మూవీ ప్రారంభోత్సవం మే నెలలో జరుగుతుంది అన్న ప్రచారం జరిగింది. అయితే ఎవరు ఊహించని విధంగా బాలకృష్ణ బోయపాటికి హ్యాండ్ ఇచ్చి తమిళ దర్శకుడు కెఎస్ రవికుమార్ కు లైన్ క్లియర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

ప్రస్తుతం ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ఎమోషనల్ సినిమాలను తీయడంలో చాల దిట్ట అయిన కెఎస్ రవికుమార్ చెప్పిన కథ బాలకృష్ణకు బాగా నచ్చడంతో ముందుగా ఆ ప్రాజెక్ట్ ను మొదలు పెడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో బాలయ్య కెఎస్ రవికుమార్ ల కాంబినేషన్ లో ‘జై సింహా’ సినిమాలను తీసిన సి. కళ్యాణ్ ఈసినిమాను నిర్మించబోతున్నట్లు టాక్. 

అయితే బోయపాటి మూవీని బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తాను అని మాట ఇచ్చిన పరిస్థుతులలో బోయపాటి సినిమాలు అంటేనే భారీ బడ్జెట్ సినిమాలు కాబట్టి ఆ సాహసం వెంటనే చేసే కంటే ముందుగా ఒక ఎమోషనల్ సినిమాతో ముందుకు రావాలని బాలయ్య స్కెచ్ అని అంటున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ తో బాలకృష్ణ ఊహించని షాక్ తిన్న నేపధ్యంలో ‘వినయ విధేయ రామ’ ఫ్లాప్ తో సతమతమవుతున్న బోయపాటితో వెంటనే జత కట్టడం కన్నా కెఎస్ రవికుమార్ తో సేఫ్ గేమ్ ఆడాలని బాలకృష్ణ ఆలోచన అని అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: