టాలీవుడ్ లో ప్రస్తుతం ఓ హీరోయిన్ క్రేజీగా మారింది. కన్నడ నుండి వచ్చిన ఈ భామ తెలుగులో చేసిన మూడు సినిమాలకే స్టార్ క్రేజ్ దక్కించుకుంది. ఆ చేసిన 3 సినిమాలు కూడా యువ హీరోలతో చేసినవే అయినా కూడా అమ్మడికి ఓ రేంజ్ లో పాపులారిటీ వచ్చింది. టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ లీగ్ లో ఉన్న ఆ భామ ఎవరు అంటే కన్నడ బ్యూటీ రష్మిక మందన్న అని తెలుస్తుంది. 


ఛలో సినిమాతో తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టిన రష్మిక గీతా గోవిందం సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకుంది. ఆ సినిమా హిట్ లో విజయ్ దేవరకొండ ఇమేజ్ ఎంత బాగా ఉపయోగపడిందో రష్మిక అందం, అభినయం కూడా అంతే ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత వచ్చిన దేవదాస్ పెద్దగా ఆకట్టుకోలేదు. అయినా సరే అమ్మడికి అవకాశాలు ఏమాత్రం తగ్గలేదు.


ప్రస్తుతం విజయ్ దేవరకొండతోనే డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్న రష్మిక మందన్న అక్కినేని అఖిల్ 4వ సినిమా హీరోయిన్ గా కూడా ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో తెరకెక్కే ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా రష్మికనే ఫిక్స్ చేశారట.


చేసిన 3 సినిమాలు నిరాశకలిగించడంతో భాస్కర్ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు అఖిల్. అంతేకాదు రష్మిక క్రేజ్ కూడా యాడ్ అయితే సినిమాకు ప్లస్ అవుతుందని భావించి ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేశారట. చూస్తుంటే రష్మిక తెలుగులో టాప్ హీరోయిన్ గా నంబర్ 1 స్థానంలో నిలబడేలా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: