‘మజిలీ’ సక్సస్ ను ఎంజాయ్ చేస్తున్న నాగచైతన్య సమంతలు ఇప్పట్లో మళ్ళీ కలిసి నటించే ఆలోచన చేయలేదు. అయితే వారివారి ఆలోచనలను ‘మహాసముద్రం’ మార్చివేసింది అన్న వార్తలు వస్తున్నాయి. ‘ఆర్ ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతి చెప్పిన ‘మహాసముద్రం’ కథ సమంత చైతన్యలకు విపరీతంగా నచ్చినట్లు టాక్. 

నాగచైతన్య పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్ గా నటించబోతున్న ఈమూవీ కథ చాల పవర్ ఫుల్ గా ఉంటుంది అని సమాచారం. ప్రస్తుత సమాజంలోని అనేక సమస్యలను ఎత్తి చూపుతూ అల్లబడిన ఈకథ చైతన్యను ఒక పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్ గా చూపెడుతూ మాస్ ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా ఈమూవీ కథను అజయ్ భూపతి అల్లినట్లు సమాచారం. 

1999 ప్రాంతాలలో కృష్ణ వంశీ సముద్రం అన్న ఒక పవర్ ఫుల్ స్టోరీతో అప్పట్లో ఒక సినిమాను తీసాడు. ఆసినిమా అప్పట్లో ఒక సంచలనం. జగపతి బాబుకు ఈసినిమా ఎంతో పేరు తీసుకువచ్చింది. తిరిగి రెండు దశాబ్దాల తరువాత ‘సముద్రం’ ను ‘మహాసముద్రం’ గా మార్చి అజయ్ భూపతి వేరే కథతో సినిమాను తీస్తూ ‘సముద్రం’ ను నేపధ్యంగా వాడుతున్నాడు. 

అజయ్ భూపతి ‘మహాసముద్రం’ లో సమంత పాత్ర కూడ చాల పవర్ ఫుల్ అని టాక్. చైతూ సమంతల అంగీకారం ఈమూవీ ప్రాజెక్ట్ కు రావడంతో ఈమూవీ స్క్రిప్ట్ పనులు ప్రస్తుతం అత్యంత వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే తిరిగి సమంత చైతన్యల మ్యాజిక్ వచ్చే ఏడాది సమ్మర్ కు పనిచేసేలా అజయ్ భూపతి మాష్టర్ ప్లాన్ అని అంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: