తెలుగు ఇండస్ట్రీలో జోష్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య మొదటి చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఏం మాయ చేసావే’చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇండస్ట్రీకి పది సంవత్సరాలు దాటినప్పటికీ సరైన హిట్ లేక తెగ బాధపడుతున్నాడు. ఏం మాయ చేసావే చిత్రంలో నటించిన సహనటి సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
పెళ్లైన తర్వాత వీరిద్ది కాంబినేషన్ లో వచ్చిన ‘మజిలీ’సూపర్ హిట్ అయ్యింది. శివ నిర్వాన ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం చైతూ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రం కావడం..భారీగా కలెక్షన్లు రాబట్టడంతో ఇప్పటికే ఇందులో నటించిన సమంత తన రెమ్యూనరేషన్ పెంచినట్లు వార్తలు వచ్చాయి.
తాజాగా ఇప్పుడు నాగ చైతన్య కూడా తన రెమ్యూనరేషన్ పెంచేశాడనేది ఫిల్మ్ నగర్ టాక్. విజయాల కోసం ఆయన ఎంతో సహనంతో ఎదురుచూస్తూ, ఇటీవల 'మజిలీ' చేశాడు. ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతూ, చైతూ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. దాంతో నాగ చైతన్య తన రెమ్యూనరేషన్ కోటికి పెంచినట్లు ఫిలిమ్ వర్గాల టాక్.
మొత్తానికి ‘మజిలీ’ఎఫెక్ట్ భార్యాభర్తలు ఇద్దరూ ఒకేసారి పారితోషికం పెంచేశారని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం 'వెంకీమామ' చేస్తోన్న చైతూ, ఆ తరువాత చిత్రాలు అజయ్ భూపతితో చేయనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.