ఆర్ఎక్స్ 100 సినిమాతో  సంచలన విజయం అందుకున్నాడు యువ కధానాయకుడు కార్తికేయ. మొదటిసినిమా విజయంతో కార్తికేయకి మంచి క్రేజ్ లభించడంతో వరుసగా సినిమాల మీద సినిమాలను చేసుకుంటూ వెళ్తున్నాడు.  ఇప్పటికే "హిప్పీ" అనే వెరైటీ కాన్సెప్ట్ సినిమాను పూర్తిచేసాడు కార్తికేయ.  షూటింగ్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఆ చిత్రం అతిత్వరలోనే విడుదలకు సిద్దమవుతుంది.

ఇక ఈ చిత్రానికి ప్యారెలెల్ గా మరిచిత్రాన్ని కూడా లైన్ లో పెట్టాడు కార్తికేయ. ప్రముఖ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను శిష్యుడైన  అర్జున్ జంధ్యాలను  దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమా చేస్తున్నాడు కార్తికేయ. స్ప్రింట్‌ ఫిలిమ్స్‌,  జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మాతలు. ఇప్పటికే  ఈ మూవీ షూటింగ్ 70శాతానికి పైగా పూర్తయింది. తాజాగా ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు.

"గుణ369" అనే వినూత్న పేరును ఈ చిత్రానికి ఖరారు చేసినట్లు చిత్రబృందం తెలిపింది. పూర్తిస్థాయి ప్రేమ కధాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్నకథగా తెలుస్తోంది. ఇక ఈ చిత్ర టైటిల్  వెనక ఉన్న 369 కు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం ఉందని, అది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందేనని చిత్రబృందం తెలిపింది. ఇక ఈ చిత్రానికి చైతన్య భరధ్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. అతిత్వరలోనే ఈ చిత్ర రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.  ఇక ఈ చిత్రంతో పాటు మరో రెండు చిత్రాలను కార్తికేయ లైన్ లో పెట్టినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: