తమిళ స్టార్ హీరో రజినీకాంత్ ఇప్పుడు నటుడిగానే కాకుండా రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. లింగా సినిమా నుంచి ఆయన ప్రతి సంవత్సరం కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్నారు.  ప్రస్తుతం ఆయన మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్భార్’సినిమాలో నటిస్తున్నారు.  ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ నయనతార, అందాల భామ కీర్తి సురేష్ నటిస్తున్నారు.  ఈ సినిమాలో రజినీ ద్విపాత్రాభినయంలో కనిపిస్తున్నారు..ఒక పాత్ర పోలీస్ ఆఫీసర్ మరో పాత్ర సామాజిక కార్యదర్శిగా నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.  ప్రస్తుతం ఈ షూటింగ్ షరవేగంగా జరుపుకుంటుంది.  ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రలో నివేదా థామస్ నటిస్తుంది.  


ప్రస్తుతం స్టార్ హీరోల వారసులు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే రజినీ పెద్ద అల్లుడు ధనుష్ హీరోగా,నిర్మాతగా కొనసాగుతున్నారు.  ఆయనకు కూడా మాస్ ఆడియన్స్ ఫాలోయింగ్ ఉంది. చిన్నల్లుడు విశాగన్ ను కూడా హీరోగా నిలబెట్టే ప్రయత్నాల్లో రజనీకాంత్ ఉన్నాడనే టాక్ కోలీవుడ్లో బలంగా వినిపిస్తోంది.విశాగన్ వ్యాపార వేత్త అయినప్పటికీ నటన పట్ల ఆసక్తి వుంది. రజనీ కూతురు సౌందర్యతో వివాహానికి ముందే ఆయన ఒక సినిమాలో చేశాడు గానీ అది సరిగ్గా ఆడలేదు. 


తాజాగా  కార్తీక్ సుబ్బరాజ్ ను రజనీ పిలిపించి, విశాగన్ కోసం ఒక మంచి కథను తయారు చేయించి ఆయనతో ఒక మంచి హిట్ మూవీ చేయమని చెప్పారట. ఆ మద్య పెట్టా లాంటి హిట్ సినిమా రజినీకి అందించారు.  అంతే కాదు మరికొందరు దర్శకుల చెవిన కూడా చిన్నల్లుడి గురించి రజనీ ఓ మాట వేశాడని చెప్పుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: