సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లోని 25 వ సినిమాగా తెరకెక్కిన చిత్రం "మహర్షి" వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మించగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. అల్లరి నరేష్ ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు.  ఇక నిర్మాణ కార్యక్రమాలు శరవేగంగా పూర్తిచేసుకుంటున్న ఈ చిత్రం తర్వాత మహేష్  హ్యాట్రిక్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారన్న సంగతి తెలిసిందే..

ఇప్పటికే కథ చర్చలు పూర్తిచేసుకున్న ఈ చిత్రంలో జగపతిబాబు, విజయశాంతి, బండ్ల గణేష్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలను పోషిస్తున్నట్లు గా ఇప్పటికే వార్తలు బయటకు వస్తున్నాయి అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఒక కీలకపాత్రను రమ్యకృష్ణ పోషిస్తున్నట్లు తెలుస్తోంది.  "బాహుబలి"  సినిమా తర్వాత రమ్యకృష్ణ కంటెంట్ ఉన్న పాత్రలనే ఎంచుకుంటున్నారు, ఇక ఈ చిత్రంలో దర్శకుడు అనిల్ రమ్య పాత్రను చాలా పవర్ ఫుల్ గా నేరేట్ చేసాడని, ఆ పాత్ర విలువ నచ్చడంతో రమ్య వెంటనే నటించేందుకు ఒప్పుకుందని తెలుస్తోంది.

  ఇక ఇదే నిజమైతే మహేష్ తో రమ్యకృష్ణ రెండోసారి నటించబోతుంది.  గతంలో వీరిద్దరూ కలిసి "నాని" సినిమాలో నటించారు, దాదాపు 15 సంవత్సరాల తర్వాత మరోసారి మహేష్ సినిమాలో రమ్యకృష్ణ నటిస్తుండటం విశేషం.  ఇక ఈ చిత్ర  షూటింగ్ ను జులై నుంచి ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి సినిమా అంటే మినిమమ్ ఎంటర్టైనర్ గ్యారంటీ కాబట్టి మహేష్ లోని కామెడీ టైమింగ్ ని అనిల్ బాగా హ్యాండిల్ చేస్తాడని మహేష్ అభిమానులు భావిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: