తెలుగు లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన అలనాటి అందాల తార మహానటి సావిత్రి జీవిత కథ ‘మహానటి’చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన నటి కీర్తి సురేష్ తెలుగు, తమిళ ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసింది.  అంతకు ముందు తెలుగు లో నేను శైలజ, నేను లోకల్ చిత్రాల్లో కనిపించినా మహానటి చిత్రం ఎఫెక్ట్ బాగా పడింది.  దాంతో తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంటుంది. 

ఈ మద్య మలయాళం, హిందీ భాషల్లో కూడా నటిస్తుంది.  ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నగేశ్ కుకునూర్ తొలిసారిగా టాలీవుడ్ లో ఓ చిత్రాన్ని తీస్తున్నారు. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి కథానాయకుడిగా కనిపించనుండగా, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

వర్త్ ఎ షాట్ సంస్థ తొలిసారిగా నిర్మాణ సారథ్యం వహిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చనున్నారు. ఈ చిత్రంలో ఆదిపినిశెట్టి సరసన కీర్తి సురేష్ నటించనున్నది.  ఈ చిత్రం క్రీడా నేపథ్యంలో కొనసాగుతుందట. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం పూణే పరిసరాల్లో జరుగుతుంది.  హీరోగా వచ్చిన ఆది ఈ మద్య విలన్ గా యూటర్న్ తీసుకున్నాడు.  ఓ వైపు విలన్ గా నటిస్తూనే మరోవైపు హీరోగా కొనసాగుతున్నాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: