ఆ మద్య చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో ఫేమస్ అయిన నటి అవికా గోర్ తెలుగు లో రాజ్ తరుణ్ హీరోగా నటించిన ‘ఉయ్యాలా జంపాల’చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.  అచ్చమైన తెలుగు అమ్మాయిలా ఈ చిత్రంలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసు దోచింది.  ఆ తర్వాత వరుసగా కొన్ని చిత్రాల్లో నటించిన అవికా కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చింది. 

ఆమె ఆరోగ్యం సరిగా లేదని..బాగా లావు కావడం వల్ల సినిమాల్లో ఛాన్సులు తగ్గాయని రక రకాలుగా వార్తలు వచ్చాయి.  తాజాగా అవికా గౌర్ మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  ఇటీవల జిమ్ లో బాగా వర్క్ ఔట్ చేసి డైటింగ్ చేసి అమ్మడు చాలా స్లిమ్ గా తయారైంది.  ఈ నేపథ్యంలో  దిల్ రాజు సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది. రాజ్ తరుణ్ హీరోగా ఆయన నిర్మిస్తోన్న 'ఇద్దరి లోకం ఒకటే'లో ఆమెకి ఛాన్స్ ఇచ్చినట్టుగా సమాచారం. 

మరోసారి వెండితెరపై ఈ జోడీని చూస్తే ప్రేక్షకుల బాగానే రిసీవ్ చేసుకుంటారనే ఆలోచనలో దిల్ రాజు ఉన్నట్లు తెలుస్తుంది.  అంతేకాదు సాయితేజ్ హీరోగా మారుతి చేయనున్న సినిమాలోను ఆమెకి అవకాశం దక్కిందని అంటున్నారు. ఈసారైన ఈ బాలీవుడ్ బ్యూటీకి తెలుగు లో వరుస ఛాన్సులు వస్తాయో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: