తమిళ, తెలుగు భాషల్లో సూపర్ హిట్ చిత్రాలుగా తెరకెక్కిన "ముని" సిరీస్ లోని రెండోభాగం "కాంచన" చిత్రం గురించి అందరికి తెలిసిందే.. రాఘవలారెన్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే తాజాగా ఈ చిత్రాన్ని హిందీలో "లక్మి బాంబ్" పేరిట విడుదల రీమేక్ చేస్తున్న సంగతి తెలిసందే.

ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ హీరోగా అందాల భామ కియారా అడ్వాణీ హీరోయిన్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంతో రాఘవ లారెన్స్ దర్శకుడిగా బాలీవుడ్ లో ఆరంగ్రేటారం చేయబోతున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికార అంశం ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. అదేంటంటే కాంచన చిత్రంలో ముఖ్య పాత్రైనా హిజ్రా రోల్ అని బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ పోషిస్తున్నట్లు సమాచారం. తమిళంలో ఈ పాత్రను శరత్ కుమార్ పోషించగా హిందీలో ఏకంగా అమితాబ్ ఇలాంటి పాత్రను పోషిస్తుండటం విశేషం. 

అయితే ఈ విషయంపై బిగ్ బి  కాంపౌండ్  నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  ఇక ఈ చిత్రంలో మాధవన్‌, శోభితా ధూలిపాళ్ల కీలక పాత్రలు పోషించనున్నారు. వచ్చే నెలలో షూటింగ్ మొదలుపెట్టి ఈ సినిమాను  2020 వేసవిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇదిలా ఉండగా "ముని" సిరీస్ లో నాలుగో భాగమైన "కాంచన3" చిత్రం ఇటీవలే తెలుగు-తమిళ భాషల్లో విడుదలై సూపర్ హిట్ టాక్ అందుకొని 100 కోట్ల క్లబ్ లో చేరటం విశేషం. 


మరింత సమాచారం తెలుసుకోండి: