"ఇష్క్" "మనం" "24" "హలో" చిత్రాలతో విలక్షణ దర్శకుడిగా పేరుతెచ్చుకున్నారు విక్రమ్ కుమార్.  అయితే ఆయన తాజాగా న్యాచురల్ స్టార్ నాని తో "గ్యాంగ్ లీడర్" సినిమాని ప్రారంభించాడు విక్రమ్.  ప్రస్తుతం కథ చర్చల్లో ఉన్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ దశగా సాగుతోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది. 

అదేంటంటే ఈ చిత్ర కథను విక్రమ్ మొదట మహేష్ కోసం రాసుకున్నాడట, అయితే కథ పూర్తిగా విన్న మహేష్..తన రేంజ్ కి సరిపోయే అంశాలు లేవని విక్రమ్ కు చెప్పినట్లు తెలుస్తోంది.  అయితే ఈ కథలో హీరోతో పాటుగా విలన్ కి కూడా ఇంపార్టెన్స్ ఉండటం, కొన్ని సన్నివేశాల్లో హీరోని విలన్ డామినేట్ చేసే అంశాలు ఉండడటంతోనే మహేష్ ఈ కథకు నో చెప్పాడనే టాక్ కూడా టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. ఇక మహేష్ నో చెప్పడంతో విక్రమ్ ఆ కథను న్యాచురల్ స్టార్ నాని కి వినిపించాడు , నాని వెంటనే ఒప్పుకోవడంతో ఈ సినిమాను పట్టలేకుంది.

ఇక ఇందులో విలన్‌ పాత్రకు "ఆర్‌ఎక్స్‌ 100" ఫేం కార్తికేయను తీసుకున్నారు .అయితే ప్రస్తుతం నాని కమర్షియల్ కథల కంటే కంటెంట్ ఉండే కథలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు, దీంతో విక్రమ్ చెప్పిన కథలో కొత్త దనం కచ్చితంగా ఉండేఉంటుంది కాబట్టే ఈ సినిమా ఒప్పుకున్నాడని నాని ఫాన్స్ లో భావన, మరి మహేష్ కోసం విక్రమ్ రాసుకున్న "గ్యాంగ్‌ లీడర్‌" చిత్రాన్ని నాని ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి .  


మరింత సమాచారం తెలుసుకోండి: