ఎన్నికల ఫలితాలు రావడానికి ఇంకా 25 రోజులు సమయం ఉన్నా బాలకృష్ణ అనుసరిస్తున్న లేటెస్ట్ వ్యూహాలతో అతడికి ఎన్నికల ఫలితాలు అప్పుడే తెలిసిపోయాయ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఎన్నికల ఫలితాలు వచ్చే లోపే ఒక సినిమాను ప్రారంభిస్తున్న బాలకృష్ణ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పూరి సొంత బ్యానర్ పై మరో సినిమా చేయడానికి సంబంధించిన ప్రకటన కూడ ఈ ఎన్నికల ఫలితాల లోపే రాబోతుందని సమాచారం. 

ఈ రెండు సినిమాలతో పాటు బోయపాటి మూవీ ప్రాజెక్ట్ ను కూడ వదులుకోవడం బాలకృష్ణకు ఇష్టం లేదనీ ఈమూవీని నిర్మించే స్థాయి ఉన్న నిర్మాత గురించి అన్వేషణ చేయమని బాలయ్య బోయపాటికి సలహా ఇచ్చినట్లు టాక్. దీనితో బాలకృష్ణ ఒకేసారి మూడు సినిమాలను పట్టాలు ఎక్కించబోతూ ఉండటం షాకింగ్ గా మారి బాలయ్యకు ఎన్నికల తరువాత తెలుగుదేశం పరిస్థితి అదేవిధంగా తన హిందూపురం ఫలితం ముందుగానే తెలిసిపోయిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ఆ షాక్ నుండి తేరుకునేకంటే తాను ఎప్పుడు టాప్ హీరోనే అంటూ సంకేతాలు ఇవ్వడానికి బాలయ్య ఇలా మూడు సినిమాలతో బిజీగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీనితోపాటు తనతో సినిమాలు తీయాలని గతంలో ప్రయత్నించిన కొందరు దర్శక నిర్మాతలకు తాను సినిమాలకు రెడీ అంటూ బాలయ్య పంపుతున్న సంకేతాలను చూసి ఇండస్ట్రీ వర్గాలే షాక్ అవుతున్నట్లు సమాచారం.

దీనికితోడు బాలరిష్ణ తన సినిమాల కథల ఎంపికలో సెంటిమెంట్ ను కూడ పాటిస్తున్నాడు. బాలకృష్ణకు కలిసి వచ్చిన పోలీసు పాత్ర రాయలసీమ ఫ్యాక్షన్ నేపధ్యంలో కీస్ రవికుమార్ సినిమాలో ఉంటే పూరి సినిమాలో కూడ ఒక సరికొత్త కథతో బాలయ్య రాబోతున్నాడని టాక్. ప్రేక్షకుల అభిరుచి మారిన కాలంలో బాలకృష్ణ మారిన కాలానికి అనుగుణంగా తన శరీర బరువును తగ్గించుకుని స్లిమ్ గా కేస్ రవికుమార్ సినిమాలో కనిపించడానికి ఇప్పటికే డైటింగ్ మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: