వినాయక్ , బోయపాటి శ్రీను లాంటి మాస్ డైరెక్టర్స్ ని పక్కన పెట్టిన నందమూరి  బాలకృష్ణ తాజగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నూతన చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసందే. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే నెలలో లాంఛనంగా ప్రారంభంకానుంది.
గత సంవత్సరం సంక్రాంతికి "జై సింహ" చిత్రంతో వచ్చిన ఈ కాంబినేషన్ మంచి విజయాన్నే నమోదు చేసుకొంది. ఇక ప్రస్తుతం కథ చర్చల్లో బిజీగా ఉన్న ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రకు జగపతిబాబుని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. బాలయ్య- బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన "లెజెండ్" చిత్రంలో మొదటిసారి ప్రతినాయకుడి పాత్ర పోషించారు జగపతిబాబు. ఆ చిత్రంలో బాలయ్య- జగపతిబాబు నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
దీంతో మళ్ళీ వీరి కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రం బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం కధానాయికల వేటలో ఉంది చిత్ర బృందం, ఇక ఈ చిత్రానికి సంబంధించి ఇతర సాంకేతికనిపుణుల వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. "ఎన్టీఆర్" చిత్రంతో ఊహించని పరాజయాన్ని అందుకున్న బాలయ్య ఈ చిత్రంతో మరోసారి మాస్ హిట్ అందుకోవాలని ప్రయత్నిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: