‘మహానటి’ మూవీ తరువాత కీర్తి సురేశ్ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఒక్క ఆఫర్ కూడ అంగీకరించలేదు. అయితే ఆమె కోలీవుడ్ లో వరస పెట్టి టాప్ హీరోలు అందరితోను సినిమాలు చేస్తోంది. ఇలాంటి పరిస్థుతులలో కీర్తి చాల గ్యాప్ తీసుకుని తెలుగులో అంగీకరించిన ఒక మూవీకి సంబంధించిన వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. 

నేషనల్ అవార్డ్ విన్నర్ నగేష్ కుకునూర్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఒక స్పోర్ట్స్ డ్రామా మూవీలో కీర్తి కీలక పాత్ర పోషిస్తోంది. హీరోయిన్ ఓరియంటెడ్ మూవీగా నిర్మాణం జరుపుకుంటున్న ఈమూవీలో ఆది పినిశెట్టి జగపతి బాబులు కూడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

ఈమధ్య కాలంలో స్పోర్ట్స్ నేపధ్యం ఉన్న సినిమాలకు విపరీతమైన ఆదరణ పెరుగుతోంది. ఈ ట్రెండ్ ను ఆధారంగా చేసుకుని ‘హైదరాబాద్ బ్లూస్’ లాంటి విలక్షణ సినిమాలు తీసి జాతీయ స్థాయిలో పేరుపొందిన నగేష్ ఈమూవీని ప్రస్తుతం చాల వేగంగా వికారాబాద్ అదేవిధంగా పూణే లలో షూట్ చేస్తున్నాడు. దేవీశ్రీప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈమూవీ ఇప్పటి స్పోర్ట్స్ సినిమాల ట్రెండ్ కు అనుగుణంగా ఉంటుంది అన్న వార్తలు వస్తున్నాయి. 

ఇప్పటికే ఇలాంటి స్పోర్ట్స్ నేపధ్యం ఉన్న వెరైటీ సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్న నాగచైతన్య నానీల మూవీలు ‘మజిలీ’ ‘జెర్సీ’ ల స్థాయికి మించి ఈమూవీ కథ ఉంటుంది అన్న ప్రచారం జరుగుతోంది. ఈమూవీ ద్వారా కీర్తి సురేశ్ నటనకు మంచి అవార్డులు వస్తాయి అని కూడ అంటున్నారు. అదే జరిగితే నాని నాగచైతన్యాలు సాధించలేనిది కీర్తి సురేశ్ సాధించి చూపెడుతుంది అని అనుకోవాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: