హాట్ హాట్ యాంకర్గా పేరున్న అనసూయ ఆ తర్వాత వెండితెరంగ్రేటం చేసి ఇక్కడ కూడా ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకుంటోంది. ఆమె మంచి యాంకరే కాదు... బుల్లితెరమీదే కాకుండా వెండితెర మీద కూడా మంచి నటి అన్న పేరు తెచ్చుకుంది. బుల్లితెర మీద వచ్చిన హాట్ ఇమేజ్తో ఆమె వెండితెర మీద కూడా ప్రేక్షకులకు త్వరగానే కనెక్ట్ అయ్యింది. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో నాగార్జునకు మరదలిగా చేసిన చిలిపి చేష్టలు ప్రేక్షకుల్ని బాగా మెలిపెట్టేశాయి.
జబర్దస్త్లో గ్లామర్ వలకపోసిన అనసూయగా చాలా మంది సోగ్గాడే చిన్ని నాయనాలో అలాగే చూశారు. ఆ తర్వాత అడవి శేష్ క్షణం సినిమా చూశాక ఆమెలో ఆమె ఎలాంటి నటో అర్థమైంది. క్షణం సినిమాలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చాయి. ఆ తర్వాత రంగస్థలం సినిమాలో ఆమె చేసిన రంగమ్మత్త పాత్ర ఆమె కెరీర్లోనే కాదు... టాలీవుడ్ హిస్టరీలోనే చాలా కాలం గుర్తుండిపోయే పాత్రగా నిలిచింది.
రంగమ్మత్త పాత్ర తర్వాత అనసూయ కాస్తా రంగమ్మత్తగా మారింది. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు, నిర్మాతలు సైతం ఆమె డేట్ల కోసం వెయిట్ చేసే రేంజ్కు ఎదిగిపోయింది. డిమాండ్ పెరగడంతో అందుకు తగ్గట్టే ఆమె రేటు కూడా పెంచేసింది. తాజాగా అనసూయ మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్లో వచ్చే కొత్త సినిమాకు సైన్ చేస్తోన్నట్టు తెలిసింది.
ఈ సినిమాలో నటించేందుకు గాను ఆమె భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసింది. అనసూయ ఈ సినిమాకి రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు రెమ్యూనరేషన్ అడిగినట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్కు సమానమైన రోల్లో ఆనసూయ రోల్ ఉంటుందట. ఈ క్రమంలోనే ఆమె ఆడిగినంత ఇచ్చేందుకు కూడా దర్శక, నిర్మాతలు ఓకే చెప్పినట్టు టాక్. ఆగస్టు నుంచి ఈ సినిమా సెట్స్మీదకు వెళుతుంది.