హిందువుల పరమ పుణ్యక్షేత్రం వారణాసి ఆధ్యాత్మిక రాజధాని ఆ పుణ్యక్షేత్రంలో ఎక్కడ చూసినా శివనామ స్మరణ మాత్రమే కనిపిస్తుంది. అలాంటి వారణాసి నుండి ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న నేపధ్యంలో ఎటు చూసినా ఎన్నికల రణరంగం మాత్రమే కనిపిస్తోంది. 

ఇలాంటి పరిస్థుతులలో పూరితో కలిసి ఛార్మీ వారణాసి ప్రయాణం పెట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు వీరిద్దరూ ఏకంగా ప్రత్యేక విమానంలో వారణాసి వెళుతున్నారు. ఆసక్తికరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళితే ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాధ్ డైరెక్షన్లో వస్తున్న మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’ కోసం ఈ ప్రయాణం.

ఒక ఫైటింగ్ సీక్వెన్స్ షూట్ చేయడం కోసం పూరి వారణాసిని ఎంచుకున్న నేపధ్యంలో ‘ఇస్మార్ట్ శంకర్’ టీమ్‌ అంతా కలిసి వారణాసి టూర్ వెళ్ళుతున్న విషయాన్ని ఛార్మీ ఇలా వెరైటీగా బయటపెట్టింది. ఈ మూవీ యూనిట్ వారణాసి వెళ్ళడం కోసం ఏకంగా ఒక ప్రత్యేక విమానాన్ని బుక్ చేసుకున్న విషయం కూడ బయట పెట్టింది.  

ఈ మూవీలో ఈ ఫైట్ సీక్వెన్స్ అత్యంత కీలకం అని తెలుస్తోంది. ఈమధ్య కాలంలో పూరి రామ్ ల సినిమాలు అన్నీ వరస పరాజయాలు చెందుతున్న పరిస్థుతులలో వీరిద్దరికీ ఈమూవీ విజయం చాల అవసరం. పూరీతో సన్నిహితంగా మెలుగుతున్న ఛార్మీ నిర్మాతగా నిలబడాలి అన్నా ఈమూవీ తప్పకుండ హిట్ అయి తీరాలి. ఇలాంటి పరిస్థుతులలో ఆ కాశీ విశ్వేశ్వరుడు ఎంతవరకు పూరి ప్రయత్నాలను ఆశీర్వదిస్తాడో చూడాలి..
 



మరింత సమాచారం తెలుసుకోండి: