నిత్యామేనన్.. అందాల ప్రదర్శనే ప్రధానంగా సాగే హీరోయిన్ల లోకంలో ఆమె ఓ ప్రత్యేక తార. అందాల ఆరబోతతో కాకుండా నటనతోనే ఆకట్టుకున్న నటీమణి. అందుకే ఆమె సినిమాలంటే అంత క్రేజ్. చేసింది తక్కువ సినిమాలే అయినా ఆమె మార్కు ఉండాల్సిందే.


ఆమె నిత్యామీనన్. ఇటీవల ఈ నటి తరచూ వివాదాల్లో ఉంటోంది. ఈమెను బ్యాన్ చేయాలని ఇండస్ట్రీ ఆలోచించే వరకూ వచ్చింది. అందుకు కారణం. ఆమె ఇర్రెగ్యులారిటీ.  ప్రస్తుతం నిత్యామీన‌న్ మ‌ల‌యాళం స‌హా త‌మిళ సినిమాలు చేస్తోంది. గత కొద్ది రోజులుగా  ఈ సినిమాల షూటింగ్ కు నిత్యామీనన్ అటెండ్ అవటం లేదు‌.

ముందుగా సమాచారం ఇవ్వకుండా ఇలా డుమ్మా కొడితే నిర్మాతలకు చాలా నష్టం వస్తుంది. తాము ఫోన్ చేసినా కనీసం స్పందించడం లేదన్నది నిర్మాతల ఆరోపణ. బుద్దిగా ఉండే నిత్యా ఇలాఎందుకు చేస్తుందో ఎవరికీ అర్థం కాలేదు. చివరకు ఆమె అసలు విషయం చెప్పింది. 

అదేంటంటే.. నిత్యామీనన్‌ తల్లికి క్యాన్సర్ వ్యాధి వచ్చిందట. అందుకే షూటింగ్ ల‌కు హాజ‌రు కాలేక‌పోతోందట. అందులోనూ కాన్సర్ థర్డ్ స్టేజిలో ఉందట. అందుకే ఆమెకు సేవ చేస్తూ అక్కడే ఉందట. మరి కనీసం ఫోన్ చేయొచ్చుగా అంటారా.. ఆ బాధతో తాను ఏడుస్తూంటే మైగ్రైన్ పెయిన్ వస్తోందట. అందుకే  సమాచారం ఇచ్చే పరిస్థితి కూడా లేదట. అదీ అసలు విషయం. 



మరింత సమాచారం తెలుసుకోండి: