గతకొద్దీ కాలంగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ కి సరైన హిట్స్ పడటం లేదు,  అలానే డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి కూడా చాలా కాలంగా హిట్ లేదు  అయితే వీరిద్దరి కాంబినేషన్ లో తాజాగా వస్తున్న చిత్రం "ఇస్మార్ట్‌ శంకర్‌", ఇక ఈ చిత్రంలో అందాలా భామలు నిధి అగర్వాల్‌, నభా నటేశ్‌ కథానాయికలుగా నటిస్తున్నారు.

పూరి టూరింగ్ టాకీస్ పై పూరి జగన్నాథ్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఛార్మి సహానిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్ర షెడ్యూల్ ప్రస్తుతం వారణాసిలో జరుపుకుంటోంది, ఇదిలా ఉండగా ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే, గతంలో టాలివుడ్ టాప్ హీరోలందరికీ తన బాణీలతో సూపర్ హిట్స్ ఇచ్చిన మణి ఈ మధ్య వెనకపడ్డారు. 

దీంతో ఈ ముగ్గురు ఇప్పుడు హిట్ కోసం చాలా కసిగా వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది, ఇక ఈ చిత్రం కోసం పూరి పవర్ ఫుల్ స్క్రిప్ట్ అండ్ డైలాగ్స్ ని సిద్ధంచేయగా, రామ్ తన లుక్ ని పూర్తిగా మర్చి ఈ సినిమా కోసం రెండింతలు కష్టపడుతున్నాడు, ఇక మణిశర్మ కూడా ఈ చిత్రం కోసం హాట్ ట్యూన్స్ ని సిద్ధం చేసాడట, రామ్ ఎనర్జీకి తగ్గ ట్యూన్స్ తో పాటు నేపధ్య సంగీతం కూడా మణి  స్పెషల్ గా ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే ఈ చిత్ర టీజర్ తో పాటు సాంగ్స్ ని కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు పూరి దీంతో గతంలో సూపర్ హిట్స్ కొట్టి ప్రస్తుతం వెనకబడిన ఈ ముగ్గురు "ఇస్మార్ట్ శంకర్" తో మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ప్రయత్నిస్తున్నారు, మరి వీరి ప్రయత్నం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: