ఈ మద్య హర్రర్, థ్రిల్లర్, కామెడీ కాన్సెప్ట్ తో ఎక్కువ చిత్రాలు వస్తున్నాయి.  కంటెంట్ బాగుంటే ఎలాంటి చిత్రమైనా ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు.  ఈ తరహా చిత్రాలు ఇప్పటి వరకు ఎన్నో వచ్చాయి..చాలా వరకు హిట్ టాక్ తెచ్చుకున్నాయి.  తాజాగా మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ‘ఎంత‌వార‌లైనా’చిత్రం తెరకెక్కిం చారు. చిత్రానికి గురు చిందేపల్లి కథ, మాటలు, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు.

రామధూత ఆర్ట్స్‌ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు సుకుమార్‌ రెడ్డి జంగాలపల్లి సంగీతం అందించారు. ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు.  ‘హత్య జరిగి వారం అవుతున్నా.. నిందితుడి గురించి ఎలాంటి సమాచారం లేదు’ అంటూ అధికారి ఓ పోలీసుతో అంటున్న డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభమైంది.

‘ఎన్నాళ్ల నుంచో నీ కోసం ఎదురుచూస్తుంటే ఇప్పుడు దొరికావు..’ అని పోలీసు అంటున్న డైలాగ్స్ బట్టి చూస్తే ఈ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ లా కొనసాగేలా ఉందనిపిస్తుంది. అద్వైత్‌, జహీదా శ్యాం ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: