ఏం సాధిద్దాం అనుకుంటున్నావ్ రిషీ.. రావు రమేశ్ అడిగిన ప్రశ్న పూర్తయిందో లేదో.. బుల్లెట్‌ లా దూసుకొచ్చిన రిషీ జవాబు.. ఏలేద్దాం అనుకుంటున్నాను సార్... ప్రపంచాన్ని ఏలేద్దాం అనుకుంటున్నాను సార్..ఇదీ మహర్షి సినిమా ట్రైలర్ పవర్ ఫుల్ బిగినింగ్. 


సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మహర్షి మూవీ ట్రైలర్‌ అదరగొడుతోంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన విక్టరీ వెంకటేష్ ఈ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. మహేష్ బాబు హీరోగా నటించిన 25వ చిత్రం మహర్షి కావడం విశేషం. 

సినిమా స్టోరీ ఏంటో మూడు ముక్కల్లో అర్థమయ్యేలా పవన్ పుల్ డైలాగ్స్ ట్రైలర్‌ పడ్డాయి. మనం గతంలో ఎక్కడున్నాం... ఇప్పుడెక్కడున్నాం అనే దాన్ని బట్టి మన సక్సెస్ తెలుస్తుంది.. ఓడిపోతామనే భయంతో ఆటలో దిగితే ఎప్పటికీ గెలవలేం..  ఓడిపోవడంటే నాకు భయం... ఓడిపోతాననే భయంతో ఇక్కడిదాకా వచ్చాను.. ఇవీ అదరగొట్టిన డైలాగ్స్. 

మొదటి షాట్‌ చూడగానే... ముంబైను పోయించడానికి వచ్చా అనే బిజినెస్ మేన్ సినిమా గుర్తొస్తుంది. ఆ తర్వాత శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం.. ఇలా మరికొన్ని సినిమాలు గుర్తొస్తాయి. కోట్ల వేటలో ఓ యువకుడు ఎదిగిన తీరు ఆ తర్వాత ఆలోచనతో మారిన తీరు.. ఈ రెండూ ఈ ట్రైలర్‌లో కనిపించాయి.  

ఇక మిగిలిన పాత్రల విషయానికి వస్తే.. అల్లరి నరేశ్ ది హీరో ఫ్రెండ్ గా కీలక పాత్ర గా కనిపిస్తుంది. పూజా హెగ్దే ఓకే అనిపించింది. ఈ ట్రైలర్‌ తో అంచనాలు పెరిగిపోయాయి. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ కూడా వచ్చాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: