సౌత్ లో టాప్ డైరెక్టర్ ఎవరంటే కచ్చితంగా శంకర్ పేరే గుర్తొస్తుంది, తమిళ సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఆయన. ఇక సాంకేతికంగా భారత చలన చిత్రానికి "రోబో" "2.0" చిత్రాలను పరిచయం చేసిన ఘనత శంకర్ కి దక్కుతుంది. అయితే ప్రస్తుతం కమలహాసన్ హీరోగా "ఇండియన్ 2" చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్న పనిలో ఉన్నాడు శంకర్. 

ఇక తాజా సమాచారం ప్రకారం "ఇండియన్ 2" చిత్రం తర్వాత శంకర్ ఒక మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. అయితే ఈ మల్టీస్టారర్ చిత్రంలో హీరోలుగా ఇళయదళపతి విజయ్, సిమాన్‌ విక్రమ్‌ నటిస్తున్నట్లు  సమాచారం. ఇక ఇద్దరు స్టార్‌ హీరోలు ఇంతకు ముందు శంకర్‌తో పని చేసిన వారే, విక్రమ్ తో శంకర్ "అపరిచితుడు" "ఐ" చిత్రాలలో నటిస్తే, విజయ్ "స్నేహితుడు" చిత్రంలో నటించారు. ఇక వీరిద్దరి కోసం శంకర్ ఒక పవర్ ఫుల్ సబ్జెక్టును తయారుచేసినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సింది. 

ఇక తెలుగులో టాప్ డైరెక్టర్ అయినా రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో "ఆర్ ఆర్ ఆర్" చిత్రాన్ని తెరకెక్కుతున్న విషయం తెలిసిందే, ఇప్పటికే షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంతో పాటు ఇప్పుడు శంకర్ చేసే మల్టీస్టారర్ కూడా పట్టాలెక్కితే మరో క్రేజీ ప్రాజెక్ట్ అటు కోలివుడ్ లో ఇతి టాలివుడ్ లో తెరకెక్కుతోందని భావిస్తున్నారు సినీ అభిమానులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: