బాలీవుడ్ స్టార్ హీరో చుంకీ పాండే కూతురు అనన్య పాండే వెండితెర ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఆమె తన మొదటి సినిమా టైగర్ ష్రాప్తో కలిసి నటిస్తోంది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2లో హీరోయిన్ గా అనన్య బాలీవుడ్కు పరిచయం అవుతోంది. ఈ సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకు రాకుండానే అనన్య అప్పుడే సంచలన వ్యాఖ్యలతో మీడియాలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అవుతోంది. అనన్య బాలీవుడ్ కుర్ర హీరో వరుణ్ ధావన్ పై మనసు పారేసుకుందట.
అనన్య తన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను వరుణ్ను పిచ్చపిచ్చగా ప్రేమిస్తున్నట్టు చెప్పింది. బీ టౌన్ హీరోలలో తనకు వరుణ్ అంటే చాలా ఇష్టమని... అతడిలో నాకు ఎనర్జీతో పాటు క్యూట్నెస్, యాక్టివ్నెస్ బాగా ఆకర్షిస్తాయని అంటోంది. ఈ తరం జనరేషన్ హీరోల్లో ఆయన్ను తాను ఎక్కువుగా అభిమానిస్తానని.. అంత యాక్టివ్గా ఉండే హీరో అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండని కూడా అనన్య చెపుతోంది. ఇక బాలీవుడ్ స్టార్, దర్శకనిర్మాత కరణ్జోహార్, జోయా అక్తర్ సినిమాలు అంటే ఇష్టం అని చెప్పింది.
సంజయ్ లీలా భన్సాలీ వెండి తెర మెజీషియన్ అంటూ పేర్కొంది. ఆయన తీసిన దేవదాస్ చిత్రంను ఎప్పటికి మర్చి పోలేను. ఇక దేవదాస్ సినిమా చూసి ఆయన దర్శకత్వంలో ఎప్పటకి అయినా నటించాలన్న కోరికతో ఉంటున్నానని చెప్పింది. ఇక హీరోయిన్స్ విషయంలో స్పందిస్తూ తనకు ఆలియా భట్ ప్రియాంక చోప్రా ఇద్దరు కూడా చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది. ఏదేమైనా ఇంకా ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే అప్పుడే అనన్య అందరిని బుట్టలో పడేసేందుకు కాకా పట్టేస్తుందన్న గుసగుసలు బీ టౌన్లో వినిపిస్తున్నాయి.