తెలుగు లో ఎన్నాళ్లకు గుర్తుచ్చానా వానా అంటూ వర్షం చిత్రంతో కుర్రాళ్ల మనసు దోచిన హీరోయిన్ త్రిష.  తెలుగు, తమిళ, మళియాళ ఇండస్ట్రీలో వరుసగా స్టార్ హీరోల సరసన ఛాన్స్ దక్కించుకొని నెంబర్ వన్ హీరోయిన్ రేస్ లోకి వెళ్లింది త్రిష.  ఈ మద్య ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తుంది.  ఇటీవల ఆమె నటించిన '96', 'పేట' సినిమాలు మంచి సక్సెస్ ని అందుకున్నాయి. మధ్యలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటించి సక్సెస్ అందుకోవాలని ప్రయత్నించినా.. వర్కవుట్ కాలేదు.

తాజాగా త్రిష  మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది. దీనికి దర్శకుడు మురుగదాస్ కథ, మాటలు అందిస్తున్నారు. శరవణన్ ఈ చిత్రానికి డైరెక్ట్ చేయనున్నాడు.  ఈ చిత్రానికి ‘రాంగి’అనే టైటిల్ నిర్ణయించారు.  తాజాగా ఈ చిత్రం షూటింగ్ సమయంలో త్రిష సడెన్ గా స్పృహ తప్పి పడిపోయిందని, వెంటనే ఆమెను సమీపంలోని హాస్పిటల్ లో చేర్పించినట్లు, ప్రస్తుతం ఆమెకి చికిత్స  పొందుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 

 ఈ విషయంపై  త్రిష తల్లి ఉమాక్రిష్ణన్ స్పందించి.. త్రిషకి ఎలాంటి సమస్య లేదని, తను ఆరోగ్యంగా ఉందని తెలిపింది. 'రాంగీ' చిత్రం షూటింగ్ లో విశ్రాంతి లేకుండా రాత్రింబవళ్ళు పాల్గొంటున్నట్లు తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: