టాలీవుడ్ నిర్మాత, దర్శకుడు వంశి పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు, పూజా హెగ్డె జంటగా ‘మహర్షి’సినిమా రూపొందించారు.  ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోనే పీపుల్స్ ప్లాజాలో భారీ ఎత్తును నిర్వహించారు. ఈ  వెంకటేష్, విజయ్ దేవరకొండ అతిథులుగా విచ్చేసి సీడీ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా నటి పూజా హెగ్డె మాట్లాడుతూ..సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇప్పటికే పాతిక సినిమా చేశారు.


ఆయన డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుందో..అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని అన్నారు.  ఎవ్వరికీ తెలియని విషయం ఏంటంటే మహర్షిలో మంచి డైరెక్టర్ ఉన్నారు..భవిష్యత్తులో ఆయన డైరెక్టర్ అవుతారో లేదో తెలియదు కానీ ఆయన కొన్ని సన్నివేశాలు చూసే విధానం కొత్తగా ఉంటుందని కామెంట్ చేసింది పూజా హెగ్డే. 


ఆమె స్పీచ్ అంతా విన్న మహేష్ బాబు తర్వాత మాట్లాడుతూ..పూజాకు స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టు అనిపించింది.  ఇండస్ట్రీలో ఎవరి పని వాళ్లు చేయాలని, అప్పుడే బాగుంటుందని.. తను యాక్టర్ కాబట్టి యాక్టింగే చేస్తానని.. క్లారిటీ ఇచ్చాడు. దీన్ని బట్టి చూస్తే...పూజా మాటలను ఏదో కాంప్లిమెంట్ లా తీసుకోకుండా సీరియస్ గా ఆ విషయంపై క్లారిటీ ఇవ్వడంతో మహేష్ కి అసలు డైరెక్టర్ అయ్యే ఆలోచన లేదని తేలింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: