ప్రిన్స్ మ‌హేష్‌బాబు - సుకుమార్ కాంబినేష‌న్లో వ‌చ్చిన వ‌న్ - నేనొక్క‌డినే సినిమా ఘోర‌మైన డిజాస్ట‌ర్‌గా నిలిచింది. సినిమా అట్ట‌ర్‌ప్లాప్ అయినా విమ‌ర్శ‌కుల నుంచి మంచి ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంది. ఆ త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా వ‌స్తుంద‌న్న చ‌ర్చ‌లు నాలుగైదేళ్లుగా న‌డుస్తున్నా అవి ఇప్ప‌టి వ‌ర‌కు కార్య‌రూపం దాల్చ‌లేదు. ఆ త‌ర్వాత మ‌హేష్ ఒక్క కొర‌టాల శివ‌తోనే రెండు సినిమాల‌కు క‌మిట్ అయ్యాడు. ఆ రెండు సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి.


ఇదిలా ఉంటే తాజాగా మ‌హ‌ర్షి ప్రి రిలీజ్ ఈవెంట్ ఫంక్ష‌న్ సాక్షిగా మ‌హేష్ చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు సుకుమార్‌ను ఉద్దేశించి ప‌రోక్షంగా సెటైర్లు వేసిన‌ట్టు ఉంద‌న్న చ‌ర్చ‌లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ ఫంక్ష‌న్‌లో మ‌హేష్ మాట్లాడుతూ మహేష్ సుకుమార్ పేరు ఎత్తకుండా మాట్లాడుతూ క‌థ చెప్పి... క‌నీసం రెండు నెలలు కూడా వెయిట్ చేసే ద‌ర్శ‌కులు లేని ఈ రోజుల్లో త‌న కోసం వంశీ పైడిప‌ల్లి ఏకంగా రెండు సంవ‌త్స‌రాలు వెయిట్ చేశాడ‌ని... మ‌రో ద‌ర్శ‌కుడు అయితే వెంట‌నే మ‌రో హీరో కోసం వెళ్లి పోతాడ‌ని విసుర్లు విసిరాడు.


మ‌హేష్ చేసిన ఈ వ్యాఖ్య‌లే ఇప్పుడు సుకుమార్‌కు త‌గిలిన‌ట్టు ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ టాక్‌. వ‌న్ త‌ర్వాత మ‌హేష్‌తో సినిమా చేయాల‌ని సుకుమార్ భావించాడు. అందుకు మ‌హేష్ కూడా ఒప్పుకున్నాడు. మ‌హేష్ మ‌హ‌ర్షి షూటింగ్‌లో ఉండ‌గానే రంగ‌స్థ‌లం హిట్ జోష్‌తో ఉన్న సుకుమార్ ఓ క‌థ‌తో మ‌హేష్‌ను క‌లిశాడు. మ‌హేష్ సుకుమార్‌ను వెయిటింగ్ లిస్టులో పెట్టాడు. ఆ వెంట‌నే సుకుమార్ అదే క‌థ‌లో అల్లు అర్జున్‌ను క‌లిశాడు. అయితే మ‌నోడికి అక్క‌డా వెయిటింగ్ త‌ప్ప‌లేదు. అందుకే మ‌హేష్ సుకుమార్‌పై ఇలా ప‌బ్లిక్‌గా సెటైర్లు వేసిన‌ట్టు గుస‌గుస‌లు న‌డుస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: