సూపర్స్టార్ మహేష్బాబు లేటెస్ట్ సినిమా మహర్షి సినిమాకు రావాల్సినంత హైప్ లేదని వారం రోజులుగా మీడియాలోనూ, సోషల్మీడియాలోనూ, ఇటు ఇండస్ట్రీ ఇన్నర్ సర్కిల్స్లోనూ ఒక్కటే చర్చ నడుస్తోంది. సహజంగా ఓ పెద్ద హీరో సినిమా వస్తుందంటే ఇలాంటి వార్తలు చాలా కామన్ అని సరిపెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ మహర్షిపై వస్తోన్న వార్తలు చాలా వరకు నిజం. ఏదెలా ఉన్నా సినిమాకు నిన్నటి వరకు అంత హైప్ రాలేదు. ఇక ఈ సినిమాకు ఏకంగా ముగ్గురు నిర్మాతలు. ముగ్గురూ బడా షాట్సే.
దిల్ రాజు - అశ్వనీదత్ - పీవీపీ వీరు ముగ్గురు కలిసి ఈ భారీ బడ్జెట్ సినిమాను నిర్మించారు. ఇక సినిమా బడ్జెట్ బాగా ఎక్కువ అయ్యిందని.. దర్శకుడు వంశీ ఏకంగా రూ.140 కోట్లు ఖర్చు పెట్టించడంతో సినిమాకు టేబుల్ లాస్ వచ్చేసిందని... ఇక నిర్మాతల మధ్య లాభాల షేర్ పంచుకునే విషయంలో గొడవలు స్టార్ట్ అయ్యాయన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ముందు నుంచి సినిమా వ్యవహారాలు చూసిన రాజు సినిమాకు లాభం లేదని చెప్పడంతో మిగిలిన ఇద్దరు తమకు లాభం షేర్ ఇవ్వాల్సిందే అని ఒత్తిడి చేసినట్టు కూడా టాక్.
ఇక ఈ ముగ్గురూ ప్రి రిలీజ్ ఫంక్షన్ వేదికపై పక్క పక్కనే కూర్చున్నా ఎడమొఖం... పెడమొఖంగానే ఉన్నారు. ముగ్గురులోనూ మాటా మంతి కరువైంది. వేదిక దిగువ వరుసలో వీరు పక్కపక్కనే ఉండడం... ఇప్పటికే వీరి మధ్య వార్తలు రావడంతో మీడియా కెమేరాల ఎట్రాక్షన్ సహజంగానే వీరిపై ఉంది. వీరి పక్కనే మహేష్ 26 నిర్మాత అనిల్ సుంకర కూర్చొన్నారు. ఏదేమైనా ఈ ముగ్గురు నిర్మాతలు కార్యక్రమానికి హాజరై నిడుదనం తెచ్చినా ముభావంగానే ఉన్నట్టు కనిపించారు. ఇక వేదికమీద ఈ ముగ్గురు ఒకరినొకరు బలవంతంగానే పొగుడుకున్నట్టు కూడా కనిపించింది. దీంతో అక్కడ కొందరు వీరి మధ్య గ్యాప్ ఇంకా తొలగినట్టు లేదని కూడా గుసగుసలాడుకున్నారట.