తెలుగు ఇండస్ట్రీలో విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు.  ఆయన వారసులుగా ప్రస్తుతం మంచు విష్ణు, మంచు మనోజ్ లు హీరోలుగా రాణిస్తున్నారు.  ఆయన కూతురు మంచు లక్ష్మి కూడా నటి,నిర్మాత,టీవి యాంకర్ గా కొనసాగుతున్నారు.  తాజాగా మంచు మనోజ్ ఇంట్లో సంతోషాలు వెల్లువిరుస్తున్నాయి. 

మంచు విష్ణు, వినీ దంపతులు నాలుగో బిడ్డకు జన్మనివ్వనున్నారు.  ఈ విషయాన్ని తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించాడు విష్ణు. “ఓ స్పెషల్ లొకేషన్ నుంచి స్పెషల్ అనౌన్స్ మెంట్.. వినీ స్వగ్రామం, నా ఫేవరెట్ ప్లేస్ ఇది.. అరి, వివి, అవ్రామ్‌ల తరువాత నాలుగో లిటిల్ ఏంజల్ వచ్చి చేరనుందని చెప్పేందుకు సంతోషిస్తున్నా” అని ట్విట్టర్‌‌లో ట్వీట్ చేశాడు.

ఇప్పటికే ఈ దంపతులకు విష్ణు దంపతులకు తొలుత అరియానా, వివియానా కవలలు ఆ తరువాత అవ్రామ్ అనే బాబు జన్మించాడన్న సంగతి తెలిసిందే.  తాజాగా మంచు విష్ణు ట్వీట్ కి పలువురు ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: