సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనికాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ మురుగుదాస్ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం "దర్బార్" ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ చిత్రానికి మొదటినుండి ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూనే ఉంది.
ఈ చిత్ర షూటింగ్స్ స్టిల్స్ ని ఎవరో ఔత్సాహికుడు లీక్ చేయడంతో చిత్ర యూనిట్ జాగ్రత్తలు పడింది. అయితే తాజగా ఈ చిత్ర షూటింగ్ పై రాళ్ళ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ముంబైలోని ఓ కాలేజ్లో జరుగుతుంది. కాలేజీలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు షూటింగ్ స్పాట్వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారుట అయితే సిబ్బంది వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు కళాశాల భవనం మీదకు వెళ్లి.. చిత్రబృందంపై రాళ్ల దాడి చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి.
పరిస్థితులు చేజారడంతో మురగదాస్ ఈ విషయాన్ని కాలేజ్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడమే కాక లోకేషన్ చేంజ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై అధికారిక వెలువడాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో రజని ముంబై లోని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తన్నారు, 2020 పొంగల్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనీ భావిస్తోంది చిత్ర బృందం.