తెలుగు ఇండస్ట్రీలో ఒకే ఒక్క చిత్రంతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటున్నారు ఈ మద్య కొంత మంది హీరోయిన్లు.   ఆ మద్య ఫిదా చిత్రంతో సాయి పల్లవి కి ఎంత పేరు వచ్చిందో అందరికీ తెలిసిందే.  ఇక సంపత్ వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రంలో హీరోయిన్ గా నటించిన షాలినీ పాండే కి ఎంతో మంచి పేరు వచ్చింది.  మొదట ఈ చిత్రంలో లిప్ టాక్ సీన్లు చూసి షాలినీ పాండే పై రక రకాల రూమర్లు వచ్చాయి.  అయితే ఈ చిత్రం హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ అమ్మడియి ఒక్కసారే విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది.

  తెలుగు, తమిళ చిత్రాల్లో వరుసగా ఆఫర్లు వచ్చాయి.  ఆ మద్య కీర్తి సురేష్ నటించిన ‘మహానటి’చిత్రంలో ఆమె స్నేహితురాలిగా నటించింది షాలినీ పాండే. ఇటీవల వచ్చిన '118' చిత్రంలో మాత్రం గ్లామర్ పరంగా బాగానే సందడి చేసింది.  తాజాగా అమ్మడు మరో రొమాంటిక్ చిత్రంలో చాన్స్ కొట్టేసిందట.  రాజ్ తరుణ్ హీరోగా దిల్ రాజు 'ఇద్దరి లోకం ఒకటే' అనే సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

కృష్ణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా షాలినీ పాండేను ఎంపిక చేసుకున్నారు.  అయితే ఈ చిత్రలో బాలీవుడ్ బ్యూటీ అవికా గోర్ నటిస్తున్నట్లు ఆ మద్య వార్తలు వచ్చాయి..మరి ఆమెను తొలగించి షాలిని తీసుకున్నారా..లేక ఇద్దరు హీరోయిన్లా అన్న విషయం పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికి టాలీవుడ్ లో ఈ న్యూస్ హల్ చల్ చేస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: