వంశి పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు, పూజా హెగ్డె, అల్లరి నరేష్ ముఖ్య పాత్రలుగా ‘మహర్షి’సినిమా తీశారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో ఎంతో గ్రాండ్ గా జరిగింది. మహేష్ బాబు తన కెరీర్ లో మంచి హిట్స్ ఇచ్చిన దర్శకుల గురించి పేరు పేరునా చెబుతూ వారికి థ్యాంక్స్ చెప్పారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ఓ హిరోకి కెరీర్ లో మంచి సినిమాలు రావడం అంటే అది దర్శకుల పని తనం వల్లే అని అన్నారు. నా కెరీర్లో ఇంత మంచి దర్శకులు ఉండటం చాలా ఆనందంగా ఉందని అన్నారు.
ఇక మహర్షి మూవీ గురించి మాట్లాడుతూ.. వంశీ పైడిపల్లి నాకు ఈ కథ వినిపించినప్పుడు, ఈ కథను ఓకే చేస్తే చాలా కాలం పాటు వెయిట్ చేయవలసి వస్తుందని చెప్పాను. ఈ సినిమా కంటే ముందు రెండు సినిమాలు పూర్తిచేయవలసి ఉంటుందని అన్నాను. వంశి చాలా ఓపికతో నాతో మాట్లాడారు..ఈ కథ మిమ్మల్ని ఊహించుకుని రాసింది .. ఎంత ఆలస్యమైనా ఫరవాలేదు వెయిట్ చేస్తాను అన్నాడు. ఈ రోజుల్లో ఏ డైరెక్టర్ దగ్గరైనా కథ వుంటే .. రెండు నెలలు ఆలస్యమైనా వేరే హీరో దగ్గరికి వెళ్లిపోతున్నారు. కానీ నా కోసం రెండేళ్లు వెయిట్ చేశావు.. నిజంగా థ్యాంక్స్ అని అన్నాడు.
నాకు ఇంత మంచి మూవీ ఇచ్చినందుకు నీకు ఎప్పటికీ రుణపడి ఉంటా అన్నారు. ఇదే సమయంలో సుకుమార్ పై పంచ్ కూడా వేశారు. దానికి కారణం ఆ మద్య మహేష్ కి ఓ కథ వినిపించాడట సుకుమార్..అయితే ప్రస్తుతం తాను వేరే ప్రాజెక్ట్ లో ఉన్నాని అనడంతో వెంటనే ఆ కథ అల్లు అర్జున్ దగ్గరకు తీసుకు వెళ్లిన విషయం తెలిసిందే. మహేశ్ బాబు పంచ్ వేసింది సుకుమార్ కేనని, ఫంక్షన్ కి వచ్చిన వాళ్లంతా చెప్పుకుంటున్నారు.