డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటిస్తున్న 'దర్బార్' సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. వీరిద్దరి కాంబినేషన్లో మొట్టమొదటిసారి వస్తున్న సినిమా నేపథ్యంలో ఈ సినిమాపై భీభత్సమైన అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతున్న ప్రదేశం దగ్గర చిత్ర యూనిట్ పై ఆ ప్రాంతంలో ఉన్న విద్యార్థులు రాళ్ల దాడి చేసినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి.

Image result for rajinikanth

ముఖ్యంగా సినిమాకి సంబంధించిన షూటింగ్ దృశ్యాలు మరియు వర్కింగ్ స్టిల్స్ బయటకు రావడంతో..షూటింగ్ స్పాట్ లో ఎవరూ మొబైల్ ఫోన్స్ వాడకూడదని నిబంధనలు పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలోని ఓ కాలేజ్ లో జరుగుతోంది. అయితే కాలేజ్ విద్యార్ధులు కొందరు రజినీకాంత్ ని, షూటింగ్ ని చూడడానికి ఎగబడుతున్నారు. మొబైల్ లో ఫోటోలు, వీడియోలు షూట్ చేస్తున్నారు.

Image result for rajinikanth murugadoss

దీంతో చిత్రయూనిట్ వారిపై దురుసుగా ప్రవర్తించింది. దూరంగా వెళ్లిపోమని హెచ్చరించడంతో స్టూడెంట్స్ హర్ట్ అయ్యారు. దీంతో వెంటనే సెట్స్ పై రాళ్లదాడికి దిగారు. నిత్యం విద్యార్ధుల నుండి ఇలాంటి సమస్యలు ఎదురవుతుండడంతో మురుగదాస్ స్వయంగా కాలేజ్ యాజమాన్యంతో చర్చలు జరిపారట. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి: