శంకర్ దర్శకత్వంలో "బాయ్స్" , మణిరత్నం దర్సకత్వంలో "యువ" లాంటి చిత్రాలతో తెలుగు తెరకు పరిచయమైన నటుడు సిద్దార్థ్. ఆ తర్వాత తెలుగు సినిమాలపైన ఎక్కువగా ఏకాగ్రత చూపిన సిద్దార్థ్  "నువ్వొస్తానంటే నేనొద్దంటానా" "బొమ్మరిల్లు" "కొంచెం ఇష్టం కొంచెం కష్టం" చిత్రాలతో మంచి విజయాలను అందుకొని లవర్ బాయ్ ఇమేజ్ ని అందుకున్నాడు. 

అయితే ఆ తర్వాత సిద్దార్థ్ నటించిన "ఆట" "సంథింగ్ సంథింగ్ " "నాలో ఒకడు" "జబర్దస్త్"  "బావ" లాంటి చిత్రాలు డిజాస్టర్ కావడంతో తెలుగు సినిమా నుంచి తమిళ్ సినిమాకు షిఫ్ట్ అయ్యి అక్కడ మంచి విజయాలను అందుకున్నాడు. రీసెంట్ గా "గృహం" సినిమాతో అటు తమిళంలో ఇటు తెలుగులో మంచి విజయాన్ని అందుకున్నాడు సిద్దార్థ్. 

ఇక "గృహం" చిత్రం తరువాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న సిద్దార్థ్ తాజాగా ఒక స్ట్రెయిట్ తెలుగు సినిమా చెయ్యబోతున్నాడుట. తెలుగు ప్రేక్షకులను మరోసారి మెప్పించేందుకు చాలా కష్టపడుతున్నట్లు సిద్దార్థ్ తాజగా ఒక ట్వీట్ చేశాడు   "తెలుగు ప్రేక్షకులారా నా ప్రామిస్ ను గుర్తుపెట్టుకోండి .. మంచి కంటెంట్ ను సిద్ధం చేశాను . నాకు 18 నెలల సమయం ఇవ్వండి  మిమ్మల్ని అలరించడానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నిస్తాను" అని పేర్కొన్నాడు. 

సిద్దార్థ్ ట్విట్ చూస్తుంటే ఈసారి కచ్చితంగా హిట్ కొట్టాలనే సంకల్పం చాలా గట్టిగానే కనిపిస్తున్నటుంది, మరి సిద్దార్థ్ చేసిన ప్రామిస్ ను నిలబెట్టుకుంటాడో లేదో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: