‘సాహో’ షూటింగ్ ముగింపు దశకు చేరుకుంటున్న నేపధ్యంలో లేటెస్ట్ గా ఈమూవీ విషయంలో ప్రభాస్ సుజిత్ ల మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడినట్లుగా వార్తలు హడావిడి చేస్తున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారిన ఈ వార్తల ప్రకారం ప్రభాస్ ఈసినిమాకు సంబంధించి కొన్ని సీన్స్ ను రీ షూట్ చేస్తే బాగుంటుంది అన్న అభిప్రాయంలో ఉన్నట్లు టాక్.

సుమారు మూడు వందల కోట్ల భారీ బడ్జెట్ మూవీ మాత్రమే కాకుండా ‘బాహుబలి’ తరువాత విడుదల కాబోతున్న మూవీ కావడంతో ఈమూవీ అవుట్ పుట్ విషయంలో ఏ ఒక్క చిన్న పొరపాటు జరగకూడదు అన్న ఉద్దేశ్యంలో ప్రభాస్ ఈమూవీలోని కొన్ని సీన్స్ రీ షూట్ కు ఆలోచిస్తున్నట్లు సమాచారం. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈమూవీకి సంబంధించి దుబాయ్ షెడ్యూల్ లో చిత్రీకరించిన కొన్ని సీన్స్ విషయంలోనూ అదేవిధంగా ముంబాయి షెడ్యూల్ లో చిత్రీకరించిన మరికొన్ని సీన్స్ విషయంలోనూ ప్రభాస్ కు అసంతృప్తి ఏర్పడటంతో వాటిని రీ షూట్ చేయబోతున్నట్లు టాక్.

అయితే ఇప్పటికే ఈసినిమా విడుదల డేట్ విషయంలో ఎలాంటి వాయిదా వేయకూడదు అన్న స్థిర నిర్ణయంలో ప్రభాస్ ఉన్న నేపధ్యంలో ఈమూవీ రీ షూట్ కార్యక్రమం ఎలా పూర్తి చేయాలి అన్న ఆలోచనలలో ప్రభాస్ టెన్షన్ పడుతున్నట్లు టాక్. దీనికితోడు ఈమూవీకి సంబంధించిన అవుట్ పుట్ చూసిన ప్రభాస్ కు మరొక సందేహం వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. 

యాక్షన్ సీన్స్ విషయంలో ఈమూవీ హాలీవుడ్ మూవీల రేంజ్ లో కనిపిస్తున్నా ఎమోషనల్ సీన్స్ చిత్రీకరణ విషయంలో దర్శకుడు సుజిత్ తడబడ్డాడు అన్న స్పష్టమైన అభిప్రాయం ఇప్పటికే ప్రభాస్ కు ఏర్పడినట్లు తెలుస్తోంది. దీనితో మూడు వందల కోట్ల భారీ బడ్జెట్ మూవీని అనాలోచితంగా సుజిత్ కు అప్పచెప్పి తప్పు చేసానా అన్న భావన ప్రభాస్ కు ఏర్పడిన పరిస్థుతులలో ఈమూవీకి సాధ్యమైనన్ని రిపేర్లు చేసే విషయంలో ప్రభాస్ అంతర్మధనంలో ఉన్నట్లు టాక్..   


మరింత సమాచారం తెలుసుకోండి: