టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి-వివివినాయక్ కాంబినేషన్ లో ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న చిరంజీవి 151 వ సినిమా ‘సైరా నరసింహారెడ్డి’లో నటిస్తున్నారు.  ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మద్య కేరళాలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించి వచ్చారు చిత్ర యూనిట్. బ్రిటీష్ వారిని ఎదిరించిన మొట్ట మొదటి తెలుగు బిడ్డ పోరాట యోధుడు ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు.  

నిర్విరామంగా సాగుతున్న షూటింగ్ లో అనుకోకుండా ప్రమాదం జరిగింది.  చిరంజీవి హీరోగా నటిస్తున్న సైరా సినిమా సెట్లో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ శివారులోని కోకాపేటలో చిరంజీవి ఫాంహౌజ్‌లో ఏర్పాటు చేసిన సెట్‌లో ఈ ప్రమాదం జరిగింది. సెట్ అంతా కాలిపోయింది. కొన్ని రోజులుగా ఇక్కడే సినిమాకు సంబంధించిన కీలక ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు. గురువారం రాత్రి వరకూ చిత్ర బృందం షూటింగ్ జరిపింది. ఈ విషయం తెలిసిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 


ఆ మద్య   హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన అగ్నిప్రమాదంలో మనం సెట్‌తో పాటు సైరాకు సంబంధించిన సెట్ కూడా కాలిపోయింది. ఆ తర్వాత శేరిలింగంపల్లిలో వేసిన సెట్‌ను ప్రభుత్వ అధికారులు కూల్చి వేశారు.అనుమతి లేకుండా ప్రభుత్వ భూమిలో సెట్ వేశారనే కారణంతో ప్రభుత్వ అధికారులు సెట్‌ను తొలగించారు.  ఇప్పుడు ఈ అగ్ని ప్రమాదం..ఇలా సైరా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు..నష్టాలు కలుగుతూనే ఉన్నాయి. కాగా, మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో సైరా.. నరసింహారెడ్డి సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. 




మరింత సమాచారం తెలుసుకోండి: