సూపర్ స్టార్ మహేష్ బాబు, తమిళ స్టార్ నటుడు ఇళయదళపతి విజయ్ కి చాలా అనుభందం ఉంది. మహేష్ నటించిన "ఒక్కడు" "పోకిరి" చిత్రాలను రీమేక్ చేసిన విజయ్ కోలీవుడ్ లో సూపర్ హిట్స్ సాధించాడు విజయ్, అయితే మహేష్ నటించిన తాజా చిత్రం "మహర్షి" , యువ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు , అశ్విని దత్, పీవిపీ ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మించారు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్ ముఖ్య పాత్ర పోషించగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. 

ఇదిలా ఉండగా  మహేష్ 25 వ చిత్రం "మహర్షి" చిత్రాన్ని రీమేక్ చేసే ఆలోచనలో విజయ్ ఉన్నట్లు తమిళ మీడియా కోడైకూస్తోంది. 
 "మహర్షి" కథలో  మహేష్  కాలేజీ యువకుడిగా, బిజినెస్ మాన్ గా రెండు విభిన్నమైన పాత్రలతో పాటు రైతుల విలువ తెలిపే విధంగా ఈ చిత్ర కథ ఉండటంతో పాటు స్నేహానికి ప్రాణమిచ్చే స్నేహితుడిగా ఉండడంతో తనకి ఈ కథ సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నాడట విజయ్. మహేష్ గత చిత్రాలు "ఒక్కడు" "పోకిరి" రీమేక్ లు కూడా విజయ్ కి కలిసిరావడంతో ముచ్చటగా మూడోసారి మహేష్ కథను రీమేక్ చేసి మరో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాడట విజయ్. 

ఇక "మహర్షి" ట్రైలర్ విడుదలయ్యాక సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి, దానితో పాటు విడుదలకి ముందే విజయ్ లాంటి పెద్ద స్టార్ "మహర్షి" రీమేక్ పై ఆసక్తి చూపిస్తుండడంతో మహేష్ ఫ్యాన్స్ మే 9 ఎప్పుడొస్తుండానని ఎదురుచూస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: