సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో మహేష్ 25వ సినిమాగా భారీ అంచనాలతో వస్తున్న సినిమా మహర్షి. ముగ్గురు బడా నిర్మాతలు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న రిలీజ్ అవుతుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటించింది. అల్లరి నరేష్ కూడా సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు.


ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా రిలీజ్ చేసిన మహర్షి ట్రైలర్ సినిమాపై మరింత క్రేజ్ తెచ్చింది. ఇప్పటికే ట్రైలర్ కూడా యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. అయితే మహేష్ చేస్తున్న సినిమాలపై తెలుగు హీరోలే కాదు తమిళ స్టార్స్ ఓ కన్నేసి ఉంచుతారు. ముఖ్యంగా మహేష్ చేసిన ఒక్కడు, పోకిరి సినిమాలను రీమేక్ చేసిన తమిళ స్టార్ హీరో విజయ్ ఇప్పుడు మహర్షి మీద కన్నేసినట్టు తెలుస్తుంది.


మహర్షి ట్రైలర్ చూసిన విజయ్ ఈ సినిమా రిజల్ట్ చూసి వెంటనే రీమేక్ చేయాలన్న ఆలోచనలో ఉన్నాడని కోలీవుడ్ టాక్. మహర్షి కచ్చితంగా సూపర్ సక్సెస్ అవుతుందని తెలుస్తుంది. మహేష్ స్టూడెంట్ గా కంపెనీ సిఈఓ గా రైతుగా మూడు పాత్రల్లో అదరగొడుతున్నాడు. సినిమా తప్పకుండా అంచనాలను అందుకునేలా ఉంటుందని అందరు చెబుతున్నారు.


అనుకున్నట్టుగా మహర్షి సక్సెస్ అయితే ఇళయదళపతి విజయ్ తమిళంలో మహర్షి రీమేక్ చేసే అవకాశాలు ఉన్నాయి. వంశీ పైడిపల్లి మహేష్ కోసం రెండేళ్లు వెయిట్ చేసిన్ తీసిన సినిమా మహర్షి. మహేష్ కెరియర్ లో ల్యాండ్ మార్క్ మూవీగా వస్తున్న మహర్షి రికార్డుల్లో కూడా ల్యాండ్ మార్క్ సృష్టించాలని ఆశిస్తున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.



మరింత సమాచారం తెలుసుకోండి: