నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకుడిగా మూడో సినిమా తెర‌కెక్క‌నుంద‌ని కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. వీరి కాంబోలో ఇప్ప‌టికే వ‌చ్చిన సింహా, లెజెండ్ సినిమాలు రెండూ సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో హ్యాట్రిక్‌పై గురి పెట్టిన వీరు మ‌ళ్లీ త్వ‌ర‌లోనే సినిమాకు రెడీ అవుతున్నారు. విన‌య విధేయ రామ త‌ర్వాత బాల‌య్య బోయ‌పాటికే క‌మిట్ అయ్యారు. ఈ విష‌యాన్ని బోయ‌పాటి కూడా ప్ర‌క‌టించారు.


అయితే ఇప్పుడు ఈ సినిమా బ‌డ్జెట్ విష‌యంలో బాల‌య్య కండీష‌న్ల‌కు బోయ‌పాటి షాక్‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. బోయ‌పాటి మామూలుగా ఓ మోస్త‌రు హీరోతో సినిమా తీసినా రూ.40 కోట్లు డిమాండ్ చేసేలాగానే క‌థ రాసుకుంటాడు. ఇక బాల‌య్యతో సినిమాకు బోయ‌పాటి రూ.60 కోట్ల బ‌డ్జెట్ కావాల‌ని చెప్పాడ‌ట‌. బ‌డ్జెట్ మ‌రీ ఎక్కువ అయితే రిస్క్ అన్న ఉద్దేశంతో బాల‌య్య రూ.40 కోట్ల‌లో అయ్యేలా క‌థ మార్చమ‌ని కండీష‌న్ పెట్టాడ‌ట‌.


ఇక ఇప్పుడు బోయ‌పాటి క‌థ‌లో మార్పు మిన‌హా వేరే ఆప్ష‌న్ లేదు. ఎందుకంటే విన‌య విధేయ రామ సినిమా త‌ర్వాత బోయ‌పాటిని న‌మ్మి భారీ బ‌డ్జెట్ పెట్టి సినిమాలు చేసేందుకు ఎవ్వ‌రూ ముందుకు రావ‌డం లేదు. ఇక బాల‌య్య ఒక్క‌డే గ‌తంలో హిట్లు ఇచ్చినందుకు గాను న‌మ్మి సినిమాకు ఓకే చెప్పాడు. ఇప్పుడు కూడా బ‌డ్జెట్ కండీష‌న్లు గ‌ట్రా పెట్టేశాడు. ఇక ఇప్పుడు బోయ‌పాటి కూడా ఈ కండీష‌న్ల‌కు త‌లొగ్గే సినిమా చేస్తున్నాడ‌ట‌. ఎంతైనా పూల‌మ్మిన చోట క‌ట్టెల‌మ్ముకోవ‌డం అంటే ఇదేగా..!


మరింత సమాచారం తెలుసుకోండి: