2017 లో మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్న మనిషి చిల్లర్ కు బాలీవుడ్ లో అనుకున్న విధంగా అవకాశాలు రాలేదు. 2017లో మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకుంది మానుషి చిల్లర్. ఇలా కిరీటం గెలుచుకుందో లేదో అలా బాలీవుడ్ డ్రీమ్స్ ని బయటపెట్టింది. షారూక్.. అమీర్ ఖాన్ లాంటి స్టార్ల సరసన నటించాలనుందని బహిరంగంగానే ప్రకటించింది. బడా స్టార్లపై కన్నేసినా వీళ్లెవరూ అవకాశాలివ్వకపోవడంపైనా ఆసక్తికర చర్చ సాగింది.


అందాల పోటీలో ఎంతగా రాణించినా ఈ అమ్మడికి ఎందుకనో బాలీవుడ్ లో నటించాల్సిందిగా దర్శకనిర్మాతల నుంచి ఆహ్వానం అందకపోవడం ఆశ్చర్యకరమే. ఐశ్వర్యారాయ్.. సుశ్మితా సేన్.. ప్రియాంక చోప్రా.. దీపిక వంటి స్టార్లు అందాల పోటీల నుంచి వచ్చి పెద్ద స్థాయికి ఎదిగిన వారే. కానీ మానుషి ఆశించినది ఒకటి అనుకుంటే అయినది ఇంకోటి అన్న చందంగా కెరీర్ రేసులో వెనకబడింది.


అయితే ఈ భామ మిస్ వరల్డ్ హోదాలో ప్రపంచ విహారం చేస్తూ పలు స్వచ్ఛంద కార్యక్రమాల్లోనూ పాల్గొంటోంది. ఇక పనిలోపనిగా ఇతర నాయికల్లానే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ నిరంతరం ఫోటో షూట్లను షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటోంది. ఇటీవలే ఓ ట్రెండీ బ్రైడల్ కాన్సెప్ట్ ఫోటో షూట్ తో మానుషి వాడి వేడిగా చర్చల్లోకి వచ్చింది. ఆ ఫోటోలు వెబ్ లో జోరుగా వైరల్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: