ఒక  పక్క పెద్ద చిత్రాలను నిర్మిస్తూనే మరోపక్క చిన్న సినిమాలను కూడా నిర్మించడం దిల్ రాజుకి  అలవాటు. ఇక ఇటీవలే రాజ్ తరుణ్, షాలిని పాండే తో "ఇద్దరి లోకం ఒకటే" చిత్రాన్ని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. కృష్ణ అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. 

ఇక ఈ చిత్రంలో మొదట మెగా ఆకాష్ ని మొదట హీరోయిన్ గా అనుకున్నా ఆ తర్వాత షాలిని పాండే ని ఖరారు చేసారు. అయితే మార్కెట్ పరంగా కానీ, కెరీర్ పరంగా కానీ అటు రాజ్ తరుణ్ కి, ఇటు షాలిని పాండేకి సరైన క్రేజ్ లేదు. అయితే కథను పూర్తిగా నమ్మితేనే రంగంలోకి దిగని దిల్ రాజు వీరిద్దరితో సినిమా మొదలుపెట్టాడంటే కథలో ఏదో ఒక ఫీల్ ఉండేవుంటుందని అనుకుంటున్నారు కొందరు. 

ఇక "అర్జున్ రెడ్డి"లాంటి సూపర్ హిట్ కొట్టినా టాలివుడ్ లో పెద్దగా క్రేజ్ లేదు షాలిని, దింతో ఇప్పుడు దిల్ రాజు సినిమానే తన కెరీర్ కి డిసైడింగ్ ఫాక్టర్ గా మారింది షాలినికి. ఇక రాజ్ తరుణ్ గురించి చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో దిల్ రాజు బ్యానర్ నుంచి సినిమా రావడం చాలా అదృష్టం అనే చెప్పాలి, దీంతో ఈ సినిమా ఇప్పుడు వీరిద్దరికి కీలకంగా మారింది. అన్ని అనుకున్నట్టుగా జరిగి ఈ చిత్రం విజయం సాధిస్తే ఒకే కానీ, ఆలా జరగని పక్షంలో వీరి కెరీర్లు ప్రశ్నార్ధకమే. 


మరింత సమాచారం తెలుసుకోండి: