టాలీవుడ్ లోకి ముకుంద, ఒక లైలా కోసం సినిమాలతో అచ్చమైన తెలుగు అమ్మాయిలా కనిపించిన పూజా హెగ్డె.. అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడ జగన్నాధం’సినిమాలో బ్లాక్ బికినీతో రెచ్చిపోయింది.  మొదటి నుంచి మంచి శరీర సౌష్టవంతో పూజా హెగ్డె ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తుంది.  టాలీవుడ్ లోకి వచ్చిన కొత్తలో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ లోకి జంప్ చేసింది.  అక్కడ కూడా పెద్దగా సక్సెస్ కలిసి రాకపోవడంతో తిరిగి దక్షిణాది సినిమాలపై కన్నెసింది.  


దువ్వాడజగన్నాధం సినిమా తర్వాత పూజా దశ తిరిగింది.  వరుసగా స్టార్ హీరోల సరసన సినిమా ఛాన్సులు దక్కించుకుంది.  ఆ మద్య త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత సినిమాలో నటించింది. తాజాగా వంశి పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ‘మహర్షి’సినిమాలో మరోసారి అందాల ఆరబోతకు సిద్దమైంది.  ఇక ప్రభాస్ తో చేస్తోన్న సినిమా సెట్స్ పై వుంది. ఇలా ఒక్కసారిగా పూజా హెగ్డే రేంజ్ పెరిగిపోవడంతో ఆమె తన పారితోషికాన్ని పెంచేసిందట. ఆమె చెప్పిన పారితోషకం హరీశ్ శంకర్ కళ్లు తిరిగేలా చేసిందని టాక్.


ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న ‘వాల్మీకి’ సినిమాలో నటించడానికి 15 రోజులు కేటాయిస్తే చాలని చెప్పారట. అందుకు ఆమె 2 కోట్లు పారితోషికంగా అడిగిందని సమాచారం. వాస్తవానికి వరుణ్ తేజ్ నటిస్తోన్న ఈ సినిమా కోసం మొదట ఒక కొత్త అమ్మాయిని తీసుకోవాలని భావించారు. కానీ పూజా హెగ్డే కి ఉన్న క్రేజ్ తో ఆమెను సంప్రదించగా షాకింగ్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట.  సినిమాకి 75 లక్షలు తీసుకున్న పూజా, ఇప్పుడు 2 కోట్లు అడగడంతో ఆ షాక్ నుంచి హరీశ్ ఇంకా తేరుకోలేదని చెప్పుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: